ప్రస్తుతం టీమిండియాలో రిషబ్ పంత్ ఎంతో విలువైన ఆటగాడిగా మారాడు. గత కొంత కాలంగా పంత్ అద్భుతమైన ఫామ్ లో ఉంటూ జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఆస్ట్రేలియాలో ఆసిస్ తో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలిసారి టెస్టు ఫార్మాట్లో కి ఎంట్రీ ఇచ్చిన పంత్ అరంగేట్ర సిరీస్ తోనే తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. ఆసీస్ జట్టు పై టీమిండియా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ దక్కించుకోవడంలో పంత్ కీలక పాత్ర వహించాడు. ఇక ఆ తర్వాత ఇండియాలో ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ లో కూడా తన ఫామ్ ను కొనసాగిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు పంత్. ఇక ఆ తర్వాత ఐపీఎల్ లోనూ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తూ తనదైన ముద్ర వేశాడు. దీంతో రిషబ్ పంత్ టీమిండియా మోస్ట్ వ్యాలీబుల్ ప్లేయర్ గా మారాడు.

ఇక ప్రస్తుతం కరోనా కారణంగా క్రికెట్ కు కాస్త బ్రేక్ పడినప్పటికీ, జూన్ 18 నుండి న్యూజిలాండ్ జట్టుతో టీమిండియా ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్లో తలపడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కివీస్ బౌలింగ్‌ కోచ్‌ షేన్‌ జర్గెన్‌సెన్‌, పంతులు పై హాట్ కామెంట్స్ చేశాడు. ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌లో రిషభ్ పంత్‌పై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని, క్షణాల్లో మ్యాచును మలుపుతిప్పే సామర్థ్యం అతడికుందని ప్రశంసించాడు. ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియాపై అతడెలా చెలరేగాడో అందరికీ తెలిసిందేనన్నాడు. టీమ్‌ఇండియా బౌలింగ్‌ దళం చాలా బాగుందని వెల్లడించాడు. రిషభ్‌ పంత్‌ అత్యంత ప్రమాదకరమైన ఆటగాడని, ఎంతో ప్రశాంతంగా సానుకూల ఆలోచనా ధోరణితో ఆడతాడని అన్నాడు .

అయినప్పటికీ మా బౌలింగ్ దళం ఆత్మవిశ్వాసంతో ఉంది పంతం సమర్థంగా ఎదుర్కొని క్రికెట్ తీయగల బౌలర్స్ మా జట్టులో ఉన్నారు.’ అని జర్గెన్‌సెన్‌ పంతు పై తనదైన రీతిలో స్పందించాడు. ఇక సౌథాంప్టన్‌ వేదికగా జూన్‌ 18న భారత్‌, న్యూజిలాండ్‌ ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌లో తలపడుతున్న సంగతి తెలిసిందే. ఈ పోరు  కోసం రెండు జట్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఇప్పటికే విలియమ్సన్‌ సేన ఇంగ్లాండ్‌ చేరుకుంది. ఇక టీమిండియా కూడా జూన్ 2న అక్కడికి చేరుకోనుంది. మరి ఈ రెండు అగ్ర జట్ల మధ్య ఫైనల్ పోరు ఎలా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: