ఇకపోతే నేటి నుంచి శ్రీలంక భారత్ మధ్య టి20 సిరీస్ ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలోనే నేడు రాత్రి 8 గంటలకు మొదటి టి20 మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. పొట్టి క్రికెట్ లో యువ టీమిండియా ఆటగాళ్లు ఎలా రాణించ పోతున్నారు అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది ఈ క్రమంలోనే టీ-20 మ్యాచ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ఆటగాళ్లందరూ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే శ్రీలంక జట్టుపై ఇటీవలే రెండు వన్డేల్లో విజయం సాధించిన టీమిండియా .. ఒకే జట్టుపై అత్యధిక వన్డే మ్యాచ్లలో విజయం సాధించిన జట్టుగా టీమిండియా రికార్డు సృష్టించింది.
ఇక టీ20 లో కూడా అదే తన జోరు కొనసాగిస్తుంది అని అందరూ అనుకుంటున్నారు. వన్డే సిరీస్ గెలిచి ఇప్పటికే జోరుమీదున్న టీమిండియా జట్టు ఈరోజు ఎలా రాణించ పోతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే గత కొన్నేళ్లుగా టీమిండియా పొట్టి క్రికెట్ లో అద్భుతంగా రాణిస్తోంది. గత ఎనిమిది సిరీస్ లలో చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో జట్లతో అద్భుతంగా రాణించి విజయం సాధించింది టీమిండియా. ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ వెస్టిండీస్ శ్రీలంక బంగ్లాదేశ్తో టీ20 లో విజయం సాధించింది టీమిండియా జట్టు. ఈ క్రమంలోనే నేడు జరగబోయే టి20 సిరీస్ లో టీమిండియా ఎలా రాణించ బోతుంది అన్నదానిపై అంచనాలు భారీగానే ఉన్నాయి.