ప్రస్తుతం యువ ఆటగాళ్లతో కూడిన టీమ్ ఇండియా జట్టు శ్రీలంక పర్యటన లో ఉంది. ఈ క్రమంలోనే ఇక యువ టీమిండియా జట్టు టీం ఇండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ సారథ్య బాధ్యతలు నిర్వహిస్తున్నాడు  ఈ క్రమంలోనే ఎంతో సమన్వయంగా జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. ఇక ఇటీవల శ్రీలంక పర్యటనలో భాగంగా టీమిండియా జట్టు మొదటి వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. సొంత గడ్డపై లంక జట్టును చిత్తు చేసి.. ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. ఈ క్రమంలోనే  మూడో మ్యాచ్ కూడా గెలిచి ఇక శ్రీలంక జట్టును సొంతగడ్డపై క్లీన్స్వీప్ చేస్తుందని అనుకున్నారు. కానీ ఇక చివరి మ్యాచ్ గెలిచి పరువు నిలబెట్టుకుంది శ్రీలంక జట్టు.



 ఇకపోతే నేటి నుంచి శ్రీలంక భారత్ మధ్య టి20 సిరీస్ ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలోనే నేడు రాత్రి 8 గంటలకు మొదటి టి20 మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. పొట్టి క్రికెట్ లో యువ టీమిండియా ఆటగాళ్లు ఎలా రాణించ పోతున్నారు అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది  ఈ క్రమంలోనే టీ-20 మ్యాచ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ఆటగాళ్లందరూ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే శ్రీలంక జట్టుపై ఇటీవలే రెండు వన్డేల్లో విజయం సాధించిన టీమిండియా ..  ఒకే జట్టుపై అత్యధిక వన్డే మ్యాచ్లలో విజయం సాధించిన జట్టుగా  టీమిండియా రికార్డు సృష్టించింది.



 ఇక టీ20 లో కూడా అదే తన జోరు కొనసాగిస్తుంది అని అందరూ అనుకుంటున్నారు. వన్డే సిరీస్ గెలిచి ఇప్పటికే జోరుమీదున్న టీమిండియా జట్టు ఈరోజు ఎలా రాణించ పోతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే గత కొన్నేళ్లుగా టీమిండియా పొట్టి క్రికెట్ లో అద్భుతంగా రాణిస్తోంది. గత ఎనిమిది సిరీస్ లలో చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో జట్లతో అద్భుతంగా రాణించి విజయం సాధించింది టీమిండియా. ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ వెస్టిండీస్ శ్రీలంక బంగ్లాదేశ్తో టీ20 లో విజయం సాధించింది టీమిండియా జట్టు. ఈ క్రమంలోనే  నేడు జరగబోయే టి20 సిరీస్ లో టీమిండియా ఎలా రాణించ బోతుంది అన్నదానిపై  అంచనాలు భారీగానే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: