మీరాబాయి కంటే ముందు సిడ్నీ ఒలింపిక్స్లో కర్ణం మల్లేశ్వరి వెయిట్ లిఫ్టింగ్ ద్వారా దేశానికి కాంస్య పతకాన్ని గెలిచారు. 2000 సంవత్సరంలో ఇది జరిగింది. 21 సంవత్సరాల తరువాత ఇప్పుడు మీరాబాయి చాను రజత పతకం సాధించి దేశానికి మంచి పేరు తెచ్చిపెట్టింది.
ట్విట్టర్లో మీరాబాయి చాను అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆమె మాట్లాడుతూ "నిన్న నేను ఒలింపిక్స్లో నా మొదటి పతకాన్ని గెలుచుకున్నాను. భారతీయులందరూ నాకోసం ప్రార్థించారు. నా మొదటి పతకాన్ని దేశ ప్రజలందరికీ అంకితం చేయాలనుకుంటున్నాను. దేశ ప్రజలందరి కారణంగానే నేను ఒలింపిక్ క్రీడల్లో ఇంత గొప్ప విజయాన్ని సాధించగలిగాను. అందరికీ ధన్యవాదాలు" అంటూ చెప్పుకొచ్చింది. మరోవైపు ఒలంపిక్స్ వైపు ప్రపంచమంతా చూస్తోంది. ఈ నేపథ్యంలో ఒలంపిక్స్ లో పాల్గొంటున్న ఇండియా అథ్లెట్స్ కోసం సోషల్ మీడియాలో ప్రత్యేకంగా హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు నెటిజన్లు.