ఇదిలా ఉంటే భారత్ నుండి ఖచ్చితంగా బ్యాడ్మింటన్ విభాగంలో గోల్డ్ సాధిస్తుందని పివి సిందుపై నమ్మకముంచారు. కానీ నిన్న తై జు యింగ్ తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో వరుస సెట్ల లో ఓడి బంగారు పతకం పొందడానికి దూరమైంది. కానీ కాంస్యం పొందడానికి అవకాశాలు మాత్రం సజీవంగానే ఉన్నాయి. అయితే అభిమానులంతా కనీసం కాంస్య పతకం అయినా గెలుస్తుందా అన్న అనుమానాలు పెట్టుకున్నారు. కానీ అందరి అంచనాలను తల క్రిందులు చేస్తూ ఈ రోజు మధ్యాహ్నం చైనాకు చెందిన హి బింగ్జియావో తో తలపడింది. ఈ మ్యాచ్ లో సింధు ప్రత్యర్థికి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా వరుస సెట్లలో 21-13 21-16 స్కోర్ తో మ్యాచ్ ను చేజిక్కించుకుంది.
కొన్ని సార్లు నెట్ దగ్గర కొంచెం ఇబ్బందిపడినా, ఆ పొరపాట్లు సింధు విజయాన్ని అడ్డుకోలేకపోయాయి. సింధు ఆటకు చైనా ప్లేయర్ ఖంగుతింది. కళ్ళు తెరిచి చూసేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ విజయంతో సింధు కాంస్య పతకాన్ని దక్కించుకుంది. ఈ ఘన విజయం భారతీయులందరికీ గర్వ కారణంగా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఏ భారత క్రీడాకారుడు పాల్గొన్న వరుస ఒలింపిక్ గేమ్స్ లో పతకాన్ని సాధించింది లేదు...