అయితే విడాకుల తర్వాత సోషల్ మీడియాలో శిఖర్ ధావన్ ఎలాంటి పోస్ట్ పెట్టలేదు. కానీ ఇటీవలే సోషల్ మీడియా లో ధావన్ పెట్టిన పోస్ట్ ఎంతో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక ప్రస్తుతం నెటిజన్లు అందర్నీ కూడా ఈ పోస్టు ఎంతగానో ఆకర్షిస్తోంది. మీ డ్రీమ్ సాధించడానికి మీరు ఎంతో కష్టపడాలి.. ఇక మనం చేసే పని పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉండాలి అలా ఉంటేనే అసలు సిసలు ఎంజాయ్ మెంట్ అంటే ఏంటో తెలుస్తుంది అంటూ శిఖర్ ధావన్ తన పోస్టులో చెప్పుకొచ్చాడు. మీ కలలను సాకారం చేసుకోవాలి అనుకుంటే ఇష్టపడి పని చేయండి అంటూ శిఖర్ ధావన్ ఇటీవలే ఒక పోస్టు పెట్టారు. ఇక ఈ పోస్ట్ కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
అయితే శిఖర్ ధావన్ పెట్టిన పోస్ట్ పై ప్రస్తుతం నెటిజన్లు భిన్నమైన కామెంట్ లు పెడుతూ ఉండటం గమనార్హం. శిఖర్ ధావన్ తో విడాకులు తీసుకుంటున్నట్లు ధావన్ భార్య ఆయేష ఇంస్టాగ్రామ్ వేదికగా ప్రకటించింది. శిఖర్ ధావన్, ఆయేషా ముఖర్జీలకు 2009లో ఎంగేజ్మెంట్ జరిగింది. 2012 లో వివాహం జరిగింది. ఆయేషాను పెళ్లి చేసుకున్న శిఖర్ ధావన్.. ఆమెకు మొదటి వివాహంతో వల్ల కలిగిన ఇద్దరు సంతానాన్ని కూడా తన బిడ్డలుగానే చేసుకుంటున్నాడు . శిఖర్ ధావన్, ఆయేషాలకు ఓ కొడుకు ఉన్నాడు.