ప్ర‌పంచ లోనే అత్యంత ఎత్తైన బిల్డింగ్ బుర్జ్ ఖ‌లీఫా గురించి అంద‌రికీ తెలిసిందే. ఈ అత్యంత ఎత్తైన బిల్డింగ్ పై కొన్ని సార్లు మ‌హొన్న‌త వ్య‌క్తుల ఫోటోల‌ను ప్ర‌ద‌ర్శిస్తుంది. అలాగే మ‌హోన్న‌త వ్య‌క్త ల‌తో పాటు మ‌రి కొన్ని ర‌కాల ఫోటోల ను కూడా ప్ర‌ద‌ర్శిస్తారు. దీని వ‌ల్ల యూఏఈ ప్ర‌భుత్వం దానికి ఇస్తున్న గౌర‌వంగా భావిస్తారు. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌న దేశం నుంచి జాతి పిత మ‌హత్మ గాంధీ తో పాటు షారుక్ ఖాన్ ఫోటో ల‌ను మాత్ర‌మే బుర్జ్ ఖ‌లీఫా పై ప్ర‌ద‌ర్శించారు. అలాగే మ‌న దేశం లో వ‌చ్చే పెద్ద పెద్ద పండుగ ల‌కు కూడా బుర్జ్ ఖ‌లీఫా పై ప్ర‌ద‌ర్శిస్తారు. అయితే మ‌న దేశ క్రికెట్ పై కూడా బుర్జ్ ఖ‌లీఫా అనేక సార్లు గౌర‌వం ఇచ్చింది. అందులో భాగం గా గ‌తేడాది ఐపీఎల్ టైటీల్ గెలిచిన ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఫోటో ను కూడా ఈ అరుదైన బిల్డింగ్ పై క‌నిపించింది. ఇలా స్పోర్ట్స్ విభాగం లో ఒక భార‌త ఆట‌గాడి ఫోటో ను క‌నిపించ‌డం అదే మొద‌టి సారి.




తాజా గా మ‌రో సారి మ‌న దేశ క్రికెట్ జ‌ట్టు పై బుర్జ్ ఖ‌లీఫా అరుదైన గౌర‌వం ఇచ్చింది. ఈ నెల 17 నుంచి యూఏఈ, ఓమ‌న్ దేశాల వేదిక‌గా టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ ప్రారంభ మవుతున్న విష‌యం తెలిసిందే. ఈ వ‌రల్డ్ క‌ప్ కోసం టీమిండియా కొత్త జెర్సీ ని బీసీసీఐ విడుద‌ల చేసింది. ఈ నూత‌న జెర్సీ ని బుర్జ్ ఖ‌లీఫా పై ప్ర‌ద‌ర్శించారు. టీమిండియా కొత్త జెర్సీ తో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ తో పాటు ర‌వీంద్ర జ‌డేజా, జ‌స్ప్రీత్ బుమ్రాల ఫోటోలు కూడా క‌నిపించాయి. అంతే కాకుండా ఒక వీడియో ను కూడా బుర్జ్ ఖ‌లీఫా పై ప్లే చేసింది. ప్ర‌స్తుతం ట్విట్ట‌ర్ లో ఈ ఫోటో ల‌తో పాటు వీడియా వైర‌ల్ అవుతున్నాయి. టిమిండియా ప్లేయ‌ర్లు బుర్జ్ ఖ‌లీఫా పై క‌నిపించ‌డం తో క్రికెట్ అభిమానులు ఆనందం వ్య‌క్తం చేశారు. అయితే





మరింత సమాచారం తెలుసుకోండి: