రవిచంద్రన్ అశ్విన్..  ఒక సాదాసీదా స్పిన్నర్ స్థాయి నుంచి ప్రస్తుతం భారత క్రికెట్ జట్టులో కీలక బౌలర్  స్థాయికి ఎదిగాడు. తన స్పిన్ బౌలింగ్ లో ఎప్పుడైనా సరే మ్యాచ్ ను మలుపు తిప్పగల ప్రతిభ రవిచంద్రన్ అశ్విన్ సొంతం అనే చెప్పాలి. మిగతా మ్యాచ్ లతో పోల్చి చూస్తే రవిచంద్రన్ అశ్విన్ స్పిన్ బౌలింగ్ ఎంతో విభిన్నంగా ఉంటుంది. సాధారణంగా జట్టులో స్పిన్నర్లు ఉన్నప్పుడు ఒక నిర్దిష్ట సమయంలో మాత్రమే వారితో బౌలింగ్ చేయడానికి కెప్టెన్లు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. కానీ ఇక రవిచంద్రన్ అశ్విన్ జట్టులో ఉన్నాడు అంటే చాలు వికెట్ కావలసినప్పుడల్లా రవిచంద్రన్ అశ్విన్ తో బౌలింగ్ చేయిస్తూ ఉంటారు.


 అంతలా రవిచంద్రన్ అశ్విన్ తన స్పిన్ బౌలింగ్ తో మాయ చేస్తూ ఉంటాడు. ఇక మిగతా స్పిన్నర్ల తో పోల్చి చూస్తే ఒక డిఫరెంట్ యాక్షన్ బౌలింగ్ అశ్విన్ సొంతం అనే చెప్పాలి. బ్యాట్మెన్ ను ఎప్పుడు కన్ఫ్యూస్ చేస్తూ కీలక సమయంలో వికెట్లు తీస్తూ ఉంటాడు  రవిచంద్రన్ అశ్విన్.  ముఖ్యంగా టెస్టుల్లో అయితే రవిచంద్రన్ అశ్విన్ కి అసలు తిరుగు లేదు అని చెప్పాలి.  జట్టుకు విజయం అందించడంలో ఎప్పుడూ కీలక పాత్ర వహిస్తూనే ఉంటాడు. క్లిష్ట సమయంలో వికెట్లు పడగొడుతూ వుంటాడు. కానీ ఇటీవలి కాలంలో టి20 క్రికెట్ లో మాత్రం అశ్విన్ అంత బాగా రాణించడం లేదు.


 ఇక తాజాగా ఇదే విషయంపై స్పందించిన టీమిండియా మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ అశ్విని పై షాకింగ్ కామెంట్స్ చేశాడు.  టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టీ20 క్రికెట్ కు అనర్హుడు.. ఈ ఫార్మాట్లో అతడికి వికెట్లు తీసే సామర్థ్యం అస్సలు లేదు.. నేను కెప్టెన్ గా ఉంటే అతడిని అస్సలు జట్టులోకి తీసుకోను.. గత ఆరేళ్ల నుంచి అతడు ప్రాతినిధ్యం వహించిన ప్రతీ జట్టుకు భారంగానే మారిపోయాడు. టెస్టుల్లో  మాత్రం అశ్విన్ ఒక అద్భుతమైన బౌలర్ కానీ ఇంగ్లాండ్  సిరీస్ లో మాత్రం ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు అంటూ సంజయ్ మంజ్రేకర్ అశ్విన్ స్పిన్ బౌలింగ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: