అయితే తాజాగా బీసీసీఐ కీలక అడుగులు వేస్తోంది. యూఏఈ వేదికగా ఈ నెల 17వ తేదీ నుంచి టీ20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నీ జరగనుంది. ఇది ముగిసిన వెంటనే.... న్యూజీలాండ్ జట్టు భారత్లో పర్యటించనుంది. ఈ టూర్లో మూడు టీ20లు, రెండు టెస్టు మ్యాచులు ఇరు జట్ల మధ్య జరగనున్నాయి. నవంబర్ నెల 17, 19, 21 తేదీల్లో టీ 20 మ్యాచ్లు జరగనున్నాయి. ఈ మూడు మ్యాచ్లకు కూడా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సీనియర్లు జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీలకు విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది. ఇప్పటికే ఐపీఎల్ టోర్నీతో బిజీ బిజీగా ఉన్న ప్లేయర్స్.... ఈ టోర్నీ తర్వాత టీ20 ప్రపంచకప్ టోర్నీతో మరింత అలసిపోయే అవకాశం ఉంది. దీంతో వీరికి విశ్రాంతి కల్పించాలనేది టీమిండియా భావన. వీరికి బదులుగా ఐపీఎల్ టోర్నీలో విశేషంగా రాణించిన వెంకటేష్ అయ్యర్, హర్షల్ పటేల్, రుతురాత్ గ్రైక్వాడ్, ఆవేష్ ఖాన్లకు అవకాశం కల్పించేందుకు బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. దాదాపు 5 నెలలుగా టీమిండియా సీనియర్ ప్లేయర్స్... బయోబబుల్లో ఉన్నారని... వీరికి కొద్ది రోజుల పాటు విశ్రాంతి ఇవ్వాలనేది టీమిండియా ఆలోచన.
అయితే తాజాగా బీసీసీఐ కీలక అడుగులు వేస్తోంది. యూఏఈ వేదికగా ఈ నెల 17వ తేదీ నుంచి టీ20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నీ జరగనుంది. ఇది ముగిసిన వెంటనే.... న్యూజీలాండ్ జట్టు భారత్లో పర్యటించనుంది. ఈ టూర్లో మూడు టీ20లు, రెండు టెస్టు మ్యాచులు ఇరు జట్ల మధ్య జరగనున్నాయి. నవంబర్ నెల 17, 19, 21 తేదీల్లో టీ 20 మ్యాచ్లు జరగనున్నాయి. ఈ మూడు మ్యాచ్లకు కూడా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సీనియర్లు జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీలకు విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది. ఇప్పటికే ఐపీఎల్ టోర్నీతో బిజీ బిజీగా ఉన్న ప్లేయర్స్.... ఈ టోర్నీ తర్వాత టీ20 ప్రపంచకప్ టోర్నీతో మరింత అలసిపోయే అవకాశం ఉంది. దీంతో వీరికి విశ్రాంతి కల్పించాలనేది టీమిండియా భావన. వీరికి బదులుగా ఐపీఎల్ టోర్నీలో విశేషంగా రాణించిన వెంకటేష్ అయ్యర్, హర్షల్ పటేల్, రుతురాత్ గ్రైక్వాడ్, ఆవేష్ ఖాన్లకు అవకాశం కల్పించేందుకు బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. దాదాపు 5 నెలలుగా టీమిండియా సీనియర్ ప్లేయర్స్... బయోబబుల్లో ఉన్నారని... వీరికి కొద్ది రోజుల పాటు విశ్రాంతి ఇవ్వాలనేది టీమిండియా ఆలోచన.