ఇలా భారత క్రికెట్లో తనకంటూ ప్రత్యేకమైన పేజీ లిఖించుకున్న మహేంద్రసింగ్ ధోని గురించి చెప్పుకుంటూ పోతే ఎంత చెప్పినా తక్కువే. అయితే అటు అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ ప్రస్తుతం దేశవాళీ క్రికెట్ లీగ్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్లో మాత్రం ఆడుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోనీ తిరుగులేని ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు అని చెప్పాలి. ఇప్పుడు వరకు ధోనీ కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్ లో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల ధోనీ సారథ్యం పై టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసల వర్షం కురిపించాడు.
వచ్చే ఏడాది కూడా చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్ ఆడాలని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కోరుకుంటున్నట్లు తెలిపారు. ధోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు చేయాల్సింది ఇంకా చాలా ఉంది అంటూ తెలిపాడు. ఒక క్రీడా ఛానల్ తో మాట్లాడిన వీరు ఈ వ్యాఖ్యలు చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ అనేది ఒక అద్భుతమైన జట్టు. టీమిండియాలో ఎవరు ధోనిని అధిగమించలేరు అంటూ వీరేంద్ర సెహ్వాగ్ తెలిపాడు. ఇక చెన్నై జట్టులో కూడా సారధిగా ఎవరు ధోనిని చేరుకోలేరూ అంటూ తెలిపాడు. అది అంత తేలిక కాదు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఒక కెప్టెన్ గొప్ప తనం అనేది అతడు సాధించిన ట్రోఫీల ఆధారంగానే గుర్తిస్తారు. ధోని ఇప్పటికే చెన్నై తరఫున తొమ్మిదిసార్లు ఫైనల్ ఆడి 4 సార్లు టైటిల్ అందించాడు అలాంటి రికార్డును చేరుకోవడం అంత తేలిక కాదు. రోహిత్ శర్మ ఐదుసార్లు టైటిల్ గెలిచినప్పటికీ 9 సార్లు ఫైనల్ ఆడాలంటే చాలా సమయం పడుతుందని తెలిపారు వీరు.