ఒక సాదాసీదా క్రికెటర్గా భారత క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చి ఇక ఇప్పుడు భారత క్రికెట్లో సూపర్ ఆల్ రౌండర్ గా మారిపోయాడు హార్దిక్ పాండ్యా. పిట్ట కొంచెం కూత ఘనం అనే పదానికి హార్దిక్ పాండ్యా సరిగ్గా సరిపోతాడు. ఎందుకంటే చూడటానికి బక్కపలుచగా కనిపిస్తాడు హార్దిక్ పాండ్యా. కానీ ఒక్కసారి బ్యాట్ పట్టుకొని మైదానంలోకి దిగాడు అంటే చాలు బౌలర్ల వెన్నులో వణుకు పుట్టిస్తూ ఉంటాడు హార్దిక్ పాండ్యా. అతను బ్యాటింగ్ చేస్తుంటే స్కోరుబోర్డు సైతం పరుగులు పెడుతూ అలసిపోతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ చేసింది కొంతసేపు అయినా కూడా మ్యాచ్ స్వరూపాన్ని మొత్తం మార్చేస్తూ ఉంటాడు.



 అంతలా ప్రస్తుతం హార్దిక్ పాండ్యా భారత క్రికెట్లో సూపర్ ఆల్రౌండర్ గా కొనసాగుతున్నాడు. కేవలం భారత క్రికెట్ లో మాత్రమే కాదు అటు ఐపీఎల్ లో కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు అని చెప్పాలి. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు హార్దిక్ పాండ్యా. ఈ క్రమంలోనే ఇటీవల ఒక స్పోర్ట్స్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన లైఫ్ గురించి పలు విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. అంతేకాదు ఐపీఎల్ లో డబ్బులు ఎంతో కీలకంగా వ్యవహరిస్తుంది అన్నదానిపై కూడా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.



 డబ్బు చాలా మంచిది అది ఎన్నో అంశాలను మారుస్తూ ఉంటుంది. ఒకవేళ ఆ డబ్బే గనుక లేకపోయి ఉంటే నేను పెట్రోల్ బంక్ లో పని చేసుకుంటూ ఉండే వాడిని డబ్బే లేకుంటే ఎంతో మంది క్రికెటర్లు  క్రికెట్ ఆడే వారో నాకు తెలియదు అంటూ హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్ చేశాడు. హార్దిక్ పాండ్యా చేసిన కామెంట్స్ కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాయి. ఇకపోతే ప్రస్తుతం హార్దిక్ పాండ్యా టి20 వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన జట్టులో స్థానం సంపాదించుకున్నాడు.  ఇక ఇప్పటికే టీమిండియా జట్టు యూఏఈ వేదికగా ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టింది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: