టి20 వరల్డ్ కప్ 2021 లో  పాకిస్థాన్ మరియు  ఇండియా  పోటీపడుతున్న సంగతి మనందరికీ విధితమే. అయితే  పాకిస్థాన్ మరియు ఇండియా జట్ల మధ్య జరిగే రసవత్తర పోరు పై ఎం ఐ ఎం పార్టీ... అధినేత మరియు హైదరాబాద్ పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ మరియు ఇండియా మ్యాచ్ ను ప్రధాని మోడీ కి సంబంధం పెడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ.  పాకిస్తాన్ చర్యల కారణంగా సరిహద్దుల్లో చాలా మంది భారత బిడ్డలు మృతి చెందుతున్నారని ఇలాంటి సమయంలో పాకిస్థాన్ జట్టుతో... క్రికెట్ మ్యాచ్ అవసరమా అని ప్రధాని నరేంద్ర మోడీని నిలదీశారు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. 

పాకిస్థాన్ కేంద్రంగా కొంతమంది ఉగ్రవాదులు... సాధారణ ప్రజలతో ఆడుకుంటూ ఉంటే... ఆదేశ జట్టుతో టి20 మ్యాచ్ టీమ్ ఇండియా ఆడటం ఏంటని తీవ్రస్థాయిలో రెచ్చిపోయారు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. కేంద్ర ప్రభుత్వ అ పనితీరు మరియు వైఫల్యాల కారణంగానే... భారతదేశ బార్డర్ లలో... ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు అని తద్వారా హింస చెలరేగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్ మరియు టీం ఇండియా.. మ్యాచ్ జరగకుండా దేశ ప్రధాని నరేంద్ర మోడీ చూడాలని డిమాండ్ చేశారు హైదరాబాద్ పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ.

అటు ఈ విషయంపై... కేంద్ర మంత్రి ఇ గిరిరాజ్ సింగ్ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో  ఉగ్రవాదులు హింసకాండ చేస్తోన్న నేపథ్యంలో... టీమ్ ఇండియా మరియు పాకిస్తాన్ మ్యాచ్ ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని చెప్పారు గిరిరాజ్ సింగ్. కాగా టీ20 ప్రపంచకప్ 2021 లో భాగంగా... ఈనెల 24వ తేదీన... పాకిస్తాన్ మరియు టీమ్ ఇండియా ల మధ్య మ్యాచ్ జరుగుతుంది అన్న విషయం మనందరికీ విధితమే.

మరింత సమాచారం తెలుసుకోండి: