కేవలం భారత జట్టుకు మాత్రమే కాదు అటు బిసిసిఐ నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్లో కూడా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్గా తప్పకోపోతున్నాను అంటూ తెలిపాడు విరాట్ కోహ్లీ. ఇక ఎవరూ ఊహించని విధంగా సడన్గా కోహ్లీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో అందరూ షాక్ అయ్యారు.అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం కోహ్లీ కేవలం టి20 ఫార్మాట్ కెప్టెన్సీ బాధ్యతల నుండి మాత్రమే వండే ఫార్మాట్ కెప్టెన్సీ బాధ్యతలు కూడా వదులుకో పోతున్నాడు అన్నది తెలుస్తోంది. టి20 వరల్డ్ కప్ తర్వాత రోహిత్ శర్మ జట్టు టి-20 ఫార్మెట్ తో పాటు వన్డే ఫార్మాట్ కి కూడా టీమిండియా కొత్త కెప్టెన్ గా అవతరించి పోతున్నాడట.
అయితే ఇలా రోహిత్ శర్మ టీ-20 ఫార్మెట్ తో పాటు వన్డే ఫార్మాట్ కి కూడా కెప్టెన్గా కావడం దాదాపు ఖరారైపోయింది అన్నది ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం. ఇక ఇప్పటికే దీనికి సంబంధించిన వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. అయితే అటు టి20లో ఇప్పటికే తాను ఒక సక్సెస్ఫుల్ అన్న కెప్టెన్ అన్న విషయాన్ని రోహిత్ శర్మ ఐపీఎల్ లో నిరూపించుకున్నాడు. కాగా త్వరలో ఇక రోహిత్ శర్మ వన్డే టి20 ఫార్మట్ లకి కెప్టెన్ గా మారబోతుండగా.. కోహ్లీ కేవలం టెస్ట్ ఫార్మాట్ కి మాత్రమే పరిమితం కాబోతున్నాడు అన్నది అర్ధమవుతుంది.