కాగా గ్రూప్ 2 లో న్యూజిలాండ్, ఆఫ్గనిస్తాన్, స్కాట్లాండ్, ఇండియా, నమీబియా మరియు పాకిస్తాన్ లు ఉన్నాయి. ఈ రోజు గ్రూప్ 1 నుండి శ్రీలంక మరియు బంగ్లాదేశ్ తలపడనుండగా సాయంత్రం జరిగే మ్యాచ్ లో గ్రూప్ 2 లో ఉన్న ఇండియా మరియు పాకిస్తాన్ ల మధ్యన జరగనుంది. ఇప్పుడు అందరి దృష్టి ఈ మ్యాచ్ పైనే ఉంది. అయితే వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల అయిన రోజు నుండి ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్ గురించి సోషల్ మీడియాలో హంగామా మాములుగా లేదు. పాకిస్తాన్ జట్టుపై ట్రోల్స్ కూడా నడుస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఈ రెండు జట్ల మధ్య జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ లలో ఇండియాకు ఘనమైన రికార్డు ఉంది. అందుకే ఈ మ్యాచ్ లో ఇండియానే ఫేవరేట్.
అయితే ఎప్పటికప్పుడు పాకిస్తాన్ జట్టు ఎంతో డెవలప్ అవుతూ వస్తోంది. తనదైన రోజున ఎంతటి ప్రత్యర్థిని అయినా మట్టికరిపించగల మ్యాచ్ విన్నర్లు పాకిస్తాన్ సొంతం. అందుకే ఇండియా వీరిని లైట్ తీసుకుంటే ప్రమాదమేనని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. మరి ఇంకొన్ని గంటల్లో మొదలు కానున్న ఈ మ్యాచ్ గెలుపెవరిది అనేది అంతటా ఉత్కంఠను రేకెత్తిస్తోంది.