భారత్ జట్లు సమతూకంగా ఉందనే చెప్పాలి. ఇప్పటికే ప్రాక్టిస్ మ్యాచ్ లలో మంచి ఆట తీరును కనబరిచారు భారత ఆటగాళ్లు. అటు బ్యాటింగ్ లో పటిష్టంగా ఉంది భారత టీం. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ తో పాటు, కెప్టెన్ విరాట్ కోహ్లీ తో లైనప్ గట్టిగా ఉంది. మిడిలార్డర్తో పాటు ఆల్ రౌండర్ లు తమ ప్రతిభ ను చూపెట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. మరోవైపు బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, షమీ పేస్ విభాగంలో. స్పిన్నర్లతో భారత బౌలింగ్ విభాగం బలియంగా కనిపిస్తోంది.
భారత్లో జరగాల్సిన టి20 ప్రపంచకప్ కరోనా కారణంగా యూఏఈకి తరలిపోయింది. ఇటీవల యూఏఈలో భారత ఐపీఎల్ ఆడడంతో ఆ అనుభం ఇక్కడ ఉపయోగపడనుంది. మరోవైపు పాకిస్థాన్ ప్రపంచకప్లో ఇప్పటికీ భారత్ చేతిలో ఐదు సార్లు ఓటమి పాలవ్వడంతో.. భారత్ విజయ పరంపరను నిలువరించాలని పాకిస్థాన్ పట్టుదలతో ఉంది. పాకిస్తాన్ టీమ్ పై ఆ దేశ ప్రజలు అసహనంతో ఉన్నారు. ఎలాగైన గెలవాలనె ఒత్తిడిలో పాక్ జట్టు ఉంది. దీంతో ఎలాగైనా గెలవాలని తీవ్రంగా శ్రమిస్తోంది పాకిస్తాన్ జట్టు కూడా బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ పటిష్టంగా ఉన్నట్టు కనిపిస్తోంది. గత అనుభవాలను భేరీజు వేసుకుంటే ఈసారి కూడా భారత్ విజయమే ఖాయంగా కనిపిస్తోంది.