టీ ట్వంటి వ‌ర‌ల్డ్ క‌ప్ లో భాగంగా ఈ రోజు న్యూజిలాండ్ తో టీమిండియా త‌ల‌ప‌డ‌బోతుంది. ఈ రోజు రాత్రి 7:30 నిముషాల నుంచి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ ఇటు టీమిండియా కు అటు న్యూజిలాండ్ కు కీల‌కంగా మారింది. ఈ రెండు జ‌ట్లు లో ఎ జట్టు విజ‌యం సాధిస్తే అదే సెమిస్ కు వెళ్లి అవ‌కాశం ఉంటుంది. ఓడిపోయిన జ‌ట్టు ఇంటి దారి ప‌ట్టాల్సి వ‌స్తుంది. దీంతో ఇరు జ‌ట్లు విజ‌యానికి భారీగా క‌స‌రత్తు చేస్తున్నాయి. అంతే కాకుండా విజ‌యానికి అవ‌స‌రామైన అన్ని దారు ల కోసం ప్ర‌య‌త్నిస్తున్నాయి. కాగ ఇండియా ఇప్ప‌టికే ఒక మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్ లో పాకిస్థాన్ జ‌ట్టు చేతి లో ఘోర ప‌రాజయాన్ని ముట క‌ట్టుకుంది.



దీంతో ఈ రోజు న్యూజిలాండ్ తో జ‌ర‌గ‌బోతున్న మ్యాచ్ కు రెడీ అవుతుంది. అయితే ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఒక‌టి లేదా రెండు మార్పులు చేసే అవ‌కాశం ఉంది. ముఖ్యంగా పేస‌ర్ భువ‌నేశ్వ‌ర్ కుమార్ ను తుది జ‌ట్టు లో ఉంచే అవకశాలు చాలా త‌క్కువ గా ఉన్నాయి. భువి స్థానం శార్ధుల్ ఠాకుర్ తీసుకుంటున్న‌ట్టు స‌మాచారం. అలాగే ప‌లువురు క్రికెట్ విశ్లేష‌కులు కూడా ఇదే అభిప్రాయాన్ని చెబుతున్నారు. అయితే భువ‌నేశ్వ‌ర ఐపీఎల్ నుంచి స‌రైన ఫామ్ లో ఉండ‌టం లేదు. అయితే భువి స్థానంలో శార్ధుల్ ను తీసుకుంటే త‌న ప‌దునైన బౌలింగ్ జ‌ట్టు విజ‌యానికి తొడ్ప‌టు గా ఉంటుంద‌ని భావిస్తున్నారు. అలాగే శార్ధుల్ అవ‌స‌ర‌మైన సంద‌ర్భల‌లో ఒత్తిడి ల‌లో మంచి బ్యాటింగ్ తో కూడా మెప్పిస్తాడు. దీంతో శార్థుల్ ను తుది జ‌ట్టు లోకి తీసుకునే అవ‌కాశాలు ఉన్నాయి. అయితే శార్ధుల్ న్యూజి లాండ్ తో జ‌ర‌గ‌బోయే మ్యాచ్ లో ఉంట‌డా.. లేదా అనేది మ‌రి కొన్ని గంట ల్లో తెలిసిపోతుంది.




మరింత సమాచారం తెలుసుకోండి: