ఈ క్రమంలోనే ఒక ఆసక్తికర టాక్ వినిపిస్తోంది. మొన్నటి వరకు పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్ గా కొనసాగాడు కె.ఎల్.రాహుల్. ఇక జట్టును విజయతీరాలకు వైపు నడిపించేందుకు ఒంటిచేత్తో పోరాటం చేశాడు. ప్రస్తుతం టి 20 క్రికెట్లో అత్యుత్తమ ఆటగాడు గా కొనసాగుతున్నాడు. కాగా ప్రస్తుతం కేఎల్ రాహుల్ పంజాబ్ జట్టు నుండి లక్నో జట్టులోకి వెళ్ళిపోతున్నాడు అన్నది అర్ధమవుతుంది. ఈ క్రమంలోనే ఇటీవల కేఎల్ రాహుల్ తో లక్నో ఒప్పందం చేసుకునేందుకు సిద్ధం అవుతోందట. ఇక కొత్తగా ఐపీఎల్ లో కి ఎంట్రీ ఇస్తున్న లక్నో జట్టుకి మూడు సీజన్ల పాటు కె.ఎల్.రాహుల్ కెప్టెన్గా వ్యవహరించ పోతున్నట్లు తెలుస్తోంది.
అయితే ఇటీవలే కె.ఎల్.రాహుల్ ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా ఖాతాని ఫాలో అవ్వడం మొదలు పెట్టాడు. దీంతో ఇక రాహుల్ పంజాబ్ నుంచి ముంబై ఇండియన్స్ కు వెళ్లిపోతున్నాడు అంటూ ఊహాగానాలు కూడా వినిపించాయి. ఒకవేళ పంజాబ్ జట్టు అతని వదులుకుంటే వేలం లోకి వదిలేస్తే మాత్రం ఇక అతనికి భారీ డిమాండ్ వుంటుంది అనే టాక్ కూడా వినిపిస్తోంది. అయితే అటు ఇటు కె.ఎల్.రాహుల్ ను దక్కించుకునేందుకు ఎంత చెల్లించడానికైనా లక్నో ఫ్రాంచైజీ సిద్ధంగా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఫ్రాంచైజీ వర్గాలు కూడా కేఎల్ రాహుల్ తో సంప్రదింపులు జరుపగా అతడు కూడా సానుకూలంగానే ఉన్నాడట. చూడాలి మరి నిజంగానే కె.ఎల్.రాహుల్ లోక్నో కెప్టెన్గా మారబోతున్నాడా అన్నది.