ఇటీవలే టి20 వరల్డ్ కప్ లో అనూహ్యమైన పోరాటం చేసి ఫైనల్ వరకు వెళ్ళింది న్యూజిలాండ్ జట్టు. ఫైనల్లో ఓడి కేవలం రన్నరప్ తో సరిపెట్టుకున్న న్యూజిలాండ్ జట్టు టి20 వరల్డ్ కప్ ముగియగానే అటు ఇండియా పర్యటన ప్రారంభించింది. యూఏఈ నుంచి నేరుగా ఇండియా కు చేరుకుంది న్యూజిలాండ్ జట్టు. అయితే ఇక న్యూజిలాండ్ జట్టు ఇండియా పర్యటనలో భాగంగా ఇప్పటికే టి20 సిరీస్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం టెస్ట్ సిరీస్ ఆడుతుంది. అయితే టి20 సిరీస్ లో భాగంగా న్యూజీలాండ్ జట్టుపై టీమిండియా పూర్తిస్థాయి ఆధిపత్యం సాధించింది అని చెప్పాలి.


 ఒక్క మ్యాచ్లో కూడా ప్రత్యర్థి న్యూజిలాండ్ జట్టు గెలిచేందుకు అవకాశం ఇవ్వకుండా 3 టీ20 మ్యాచ్ లలో కూడా విజయం సాధించింది. దీంతో స్వదేశీ గడ్డపై టీమిండియా న్యూజిలాండ్ జట్టును క్లీన్ స్వీప్ చేసింది అనే చెప్పాలి. ఇక మొదటి సారి రోహిత్ శర్మ పూర్తిస్థాయి కెప్టెన్గా టి20 సిరీస్ టీమ్ ఇండియా ఆడింది. అయితే మొదటి టి20 సిరీస్ లోనే టీమిండియా క్లీన్స్వీప్ చేయడంతో  ఇక రోహిత్ శర్మ కెప్టెన్సీ ఒక శుభారంభం చేసింది. అయితే ఇక ఇటీవలే ప్రారంభమైన మొదటి టెస్టు మ్యాచ్ లో కూడా టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇలా స్వదేశీ గడ్డపై టీమిండియా విజయపరంపర కొనసాగిస్తోంది.



 అయితే ఇటీవలే న్యూజిలాండ్ జట్టు వరుసగా ఓటమిని చవి చూడటం పై ఆ జట్టు ఆల్ రౌండర్ జేమ్స్ నీషమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా  భారత పర్యటనలో న్యూజిలాండ్ జట్టు వరుసగా టాస్ ఓడిపోవడం పై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు   ప్రతిసారీ టీమిండియానే  టాస్ గెలుస్తుంది. నాకెందుకు ఏదో జరుగుతుంది అని అనుమానం కలుగుతోంది. ఎవరైనా వెళ్లి టాస్ కాయిన్ నిశితంగా పరిశీలించండి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ఒక ఫన్నీ పోస్టు సోషల్ మీడియా లో పెట్టాడు జేమ్స్ నీషామ్. ఇలా ఇప్పటి వరకు జరిగిన అన్ని మ్యాచ్ లలో కూడా టీమిండియా టాస్ గెలిచి మ్యాచ్ కూడా గెలుస్తూ వస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: