అలా మరో వికెట్ పడకుండా 3 వ రోజు ముగిసింది. మరో రెండు రోజులు మిగిలి ఉండగా గెలుపు కోసం రెండు జట్లకు సమాన అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు మొదటి సెషన్ లో ఇండియా వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడితే తర్వాత పరుగులు సాధించవచ్చు. ముఖ్యంగా కైల్ జేమీసన్ మరియు స్పిన్నర్ లను సమర్దవంతంగా ఎదుర్కోవాలి. ఈ రోజు మొత్తం ఇండియా బ్యాటింగ్ చేసి కనీసం 300 పరుగులు చేస్తే కివీస్ ముందు మంచి లక్ష్యాన్ని ఉంచవచ్చు. అయితే ఈ రోజు సెకండ్ ఇన్నింగ్స్ లో రహానే మరియు పుజారా నిలకడగా బ్యాటింగ్ చేయాల్సిన అవసరం ఉంది.
మొదటి ఇన్నింగ్స్ లో విఫలం అయిన మయాంక్ కనీసం అర్థ సెంచరీ సాధించి తన ఎంపికకు న్యాయం చేసుకోవాలి. శ్రేయస్ అయ్యర్ మొదటి ఇన్నింగ్స్ లో లాగా మరో చక్కని ఇన్నింగ్స్ ఆడాలని జట్టు కోరుకుంటోంది. మరి ఇండియా అవసరమైన పరుగులు సాధించి కివీస్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచగలదా? లేదా కివీస్ బౌలర్ల ధాటికి తల వంచుతుందా అన్నది తెలియాలంటే ఇంకాస్త సమయం వెయిట్ చేయాల్సిందే.