ఐపిఎల్ సీజన్ 15 కి అన్ని ఫ్రాంచైజీలు సిద్దం అవుతున్నాయి. ఇందులో భాగంగా వచ్చే ఏడాది మొదట్లో మెగా వేలం జరగనుంది. ఈ వేలంలో అన్ని ఫ్రాంచైజీలు తమకు నచ్చిన ఆటగాళ్లను వారికి కేటాయించిన ధరకు వేలంలో పాల్గొని సొంతం చేసుకోవచ్చు. దీని కన్నా ముందు ఇప్పటికే జట్లతో ఉన్న ఆటగాళ్లలో 4 గురిని మాత్రమే ఉంచుకుని మిగిలిన వారిని వేలానికి వదిలేయాలి. అందుకు ఐపిఎల్ పాలక మండలి ఇచిన గడువు నిన్నటితో ముగిసింది. ఐపిఎల్ లో ఉన్న 8 జట్లు ఉత్తమ ఆటగాళ్లను తమతో ఉంచుకున్నాయి. అయితే ఐపిఎల్ లో ఉత్తమ రికార్డు ఉన్న పంజాబ్ ఆటగాడు మరియు కెప్టెన్ కె ఎల్ రాహుల్ ను వేలానికి వదిలేసింది.

అయితే ఇప్పటి వరకు ఎంతో విజయవంతంగా ఆడుతూ వస్తున్న కె ఎల్ రాహుల్ ను వదిలేయడంపై అభిమానుల నుండి ఫ్రాంచైజీ పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తెలుస్తున్న సమాచారం ప్రకారం కె ఎల్ రాహుల్ ను కొనసాగించాలని పంజాబ్ యాజమాన్యం ఎంతగానో ప్రయత్నించిందట, కానీ కె ఎల్ రాహుల్ వేలానికి వెళ్ళడానికి మొగ్గు చూపినట్లు
పంజాబ్ హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే ఒక ప్రకటనలో భాగంగా క్లారిటీ ఇచ్చారు. కె ఎల్ రాహుల్ కొత్తగా ఐపిఎల్ లో భాగం కానున్న రెండు ఫ్రాంచైజీలలో ఒకటి సెలెక్ట్ చేసుకుని అందులోకి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన బేరసారాలు కూడా గత కొద్ది రోజుల నుండి జరుగుతున్నాయట.

ఈ కారణంగా బీసీసీఐ రాహుల్ ను ఒక సంవత్సరం పాటు ఐపిఎల్.నుండి బ్యాన్ చేసే ఛాన్స్ ఉందని నిన్న తెలిసింది. దీనిపై త్వరలో ఒక క్లారిటీ రానుంది. నియమ నిబంధనల ప్రకారం జట్టు నుండి అధికారిక ప్రకటన రాక ముందు ఇతర జట్లతో బేరసారాలు జరపడం నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని తెలిసిన విషయమే. మరి కొత్త జట్టుతో ఆడాలి అనే కోరిక తీరాలంటే...ముందుగా ఈ వివాదం నుండి క్లీన్ చిట్ పొందాలి. మరి ఏమి జరుగుతుందో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: