భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ... ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటన షెడ్యూల్ ప్రకారమే ఉందని అన్నారు. దక్షిణాఫ్రికా లో మొదటిసారిగా నివేదించబడిన ఓమిక్రాన్ అనే కొత్త కోవిడ్ 19 వేరియంట్ వ్యాప్తి గురించి ఆందోళన పెరుగుతోంది. అయితే ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులలో పర్యటన కొనసాగుతోంది. మాకు ఇంకా నిర్ణయించుకోవడానికి సమయం ఉంది. మొదటి టెస్టు డిసెంబర్ 17న షెడ్యూల్ చేయబడింది. మేము దాని గురించి ఆలోచిస్తాము," అని గంగూలీ అన్నారు. ముంబై లో న్యూజిలాండ్‌తో భారత్ చివరి టెస్టు ఆడుతుంది మరియు అక్కడ నుండి డిసెంబర్ 8 లేదా 9 న చార్టర్డ్ ఫ్లైట్‌లో జోహన్నెస్‌ బర్గ్‌ కు బయలుదేరుతుంది. ఆటగాళ్ళ భద్రత మరియు ఆరోగ్యాని కి బీసీసీఐ ఎప్పుడూ మొదటి ప్రాధాన్యతనిస్తుంది, దీని కోసం మేము చేయగలిగినదంతా చేస్తాము. రాబోయే రోజుల్లో ఏమి జరుగుతుందో చూద్దాం అన్నారు. అయితే  ఈ పర్యటన లో భారత్ మూడు టెస్టులు, మూడు వన్డేలు, నాలుగు టీ20 లు ఆడుతుంది.

అలాగే పూర్తి ఫిట్‌ నెస్‌ కి తిరిగి వచ్చిన తర్వాత జట్టులో తన స్థానాన్ని తిరిగి పొందేందుకు ఔట్ ఆఫ్ ఫేవర్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కు మద్దతు ఇచ్చాడు ఈ మాజీ భారత కెప్టెన్. "అతను మంచి క్రికెటర్. అతను ఫిట్‌ గా లేడు, అందుకే అతను జట్టులో లేడు. అతను యువకుడు, గాయం నుండి కోలుకున్న తర్వాత అతను తిరిగి వస్తాడని నేను ఆశిస్తున్నాను అన్నారు. అయితే ఇటీవల... హార్దిక్ ను చాలా మంది భారత మాజీ కెప్టెన్ సాపిల్ దేవ్ తో పోల్చడం పై గంగూలీ రియాక్ట్ అవుతూ... అయితే హార్దిక్ ను కపిల్ దేవ్‌ తో పోల్చవద్దు. అతను వేరే లీగ్‌ కి చెందినవాడు" అని గంగూలీ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: