ఇటీవలే భారత్ న్యూజిలాండ్ మధ్య టెస్ట్ మ్యాచ్ ఎంతో హోరాహోరీగా జరిగింది అన్న విషయం తెలిసిందే. టెస్ట్ మ్యాచ్లో విజయం సాధించడమే లక్ష్యంగా రెండు జట్లు కూడా పోటీ పడ్డాయి. అయితే టెస్ట్ మ్యాచ్లో భారత సంతతికి చెందిన న్యూజిలాండ్ బౌలర్ అజాజ్ పటేల్ ఎంతో కీలకపాత్ర వహించాడు. టీమిండియా బ్యాట్స్మెన్ లను తికమక పెట్టి వికెట్ తీసుకోవడంలో ఒక రకంగా అజాజ్ పటేల్ విజయం సాధించాడు అని చెప్పాలి. తన స్పిన్ బౌలింగ్ తో అద్భుతమే సృష్టించాడు. అంతేకాదు ఏకంగా భారీగా వికెట్లు తీసి ప్రపంచ రికార్డును సైతం సాధించాడు అజాజ్ పటేల్.



 భారత్ పై జరిగిన ఒక టెస్టు ఇన్నింగ్స్ లో పది వికెట్లు తీసి తన స్పిన్ బౌలింగ్ లో అద్భుతాలు సృష్టించి అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక అజాజ్ పటేల్ సాధించిన రికార్డు గురించి అటు క్రికెట్ ప్రపంచం మొత్తం చర్చించుకుంటూ ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఇన్నింగ్స్ లో కూడా అజాజ్ పటేల్ కీలక సమయంలో వికెట్లు పడగొట్టాడు. ఇలా అద్భుతమైన ప్రతిభ కనబరిచిన ఈ యువ ఆటగాడు పై ప్రస్తుతం ఎంతో మంది మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. భారత మాజీ లు సైతం స్పందిస్తూ అతని ప్రతిభను మెచ్చుకున్నారు.


 ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే వీరేంద్ర సెహ్వాగ్ అజాజ్ పటేల్ పై ప్రశంసలు కురిపించాడు. ఏకంగా అద్భుతంగా బౌలింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచావు అంటూ వీరేంద్ర సెహ్వాగ్ అజాజ్ పటేల్ పై ప్రశంసలు కురిపించాడు. ఇక దీనికి రిప్లై ఇచ్చిన అజాజ్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.. తన బౌలింగ్లో ఒకప్పుడు వీరేంద్ర సెహ్వాగ్ సిక్సర్లు కొట్టిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు.. థాంక్యూ సెహ్వాగ్ ఓవల్ లో నేను నెట్ బౌలర్ గా ఉన్నప్పుడు మీరు నా బౌలింగ్లో భారీ సిక్సర్లు కొట్టిన విషయం ఇంకా నాకు గుర్తుంది అంటూ కామెంట్ చేశాడు అజాజ్ పటేల్.

మరింత సమాచారం తెలుసుకోండి: