సౌతాఫ్రికాలో ఇటీవలి కాలంలో కరోనా వైరస్ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో సౌత్ ఆఫ్రికా పర్యటన ఉంటుందా లేదా అన్న దానిపై ఎన్నో అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ బిసిసిఐ సౌత్ ఆఫ్రికా పర్యటన ఉంటుంది అన్న విషయంపై క్లారిటీ ఇచ్చింది. ఈ క్రమంలోనే టీమ్ ఇండియా సౌత్ఆఫ్రికా పర్యటనకు బయలుదేర పోతుంది. అయితే ఇక ఈ పర్యటనకు ముందే టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. టీమిండియాలో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న రవీంద్ర జడేజా టీమిండియా కు దూరం అయినట్లు తెలుస్తుంది. న్యూజిలాండ్ తో జరుగుతున్న మొదటి టెస్టులో రవీంద్ర జడేజా గాయం బారిన పడ్డాడు.
దీంతో మొదటి టెస్టు మొత్తానికి దూరం అయ్యాడు రవీంద్ర జడేజా. ఆ తర్వాత రెండవ టెస్ట్ మ్యాచ్ కి కూడా అందుబాటులో లేకుండా పోయాడు. అయితే రవీంద్ర జడేజా ఇప్పట్లో కోలుకునే అవకాశం కూడా లేదట. దీంతో సౌత్ ఆఫ్రికా పర్యటనకు కూడా రవీంద్ర జడేజా దూరం కాబోతున్నట్లు తెలుస్తోంది. జడేజా గాయం నుంచి కోలుకునేందుకు కొన్ని నెలల సమయం పడుతుంది అని సమాచారం. అయితే రవీంద్ర జడేజా తో పాటు శుభమన్ గిల్,అక్షర్ పటేల్, ఇషాంత్ శర్మ లు కూడా సౌత్ ఆఫ్రికా పర్యటనకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. దీనిపై బీసీసీఐ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.