సెల బ్రీటీలు నుంచి మాములు జనాల వరకు.. సోషల్‌ మీడియా లో  వీడియోలు, ఫోటోలు పెడుతూ... తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు.   చిలిపి పనులు, వింత చేష్టలు చేస్తూ..  ప్రతి వీడియో ను సోషల్ మీడియా లో పెడుతూ.. ఆ వీడియోలకు వచ్చే కామెంట్లు, వ్యూస్‌ ను చూస్తు కాలం గడుపుతున్నారు.  ఈ జాబితాలో ఎక్కువగా సెల బ్రీటీలు ఉండటం గమనార్హం. అయి తే.... తాజాగా    ప‌ల్లీలు, బ‌ఠానీలు అమ్ముకుంటూ పాకిస్థాన్ బౌల‌ర్ వ‌హాబ్ రియాజ్ దర్శనమిచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. రోడ్డు ప‌క్క‌న ఉన్న ప‌ల్లీల వ్యాపారి వ‌ద్ద‌కు వెళ్ళిన వ‌హాబ్ రియాజ్...  వారి లాగే ఆ పల్లీలు, బఠానీలను అమ్మ‌డం మొద‌లు పెట్టాడు. అంతేకాదండోయ్ ఓ క‌స్ట‌మ‌ర్ కి ప‌ల్లీలు కూడా అమ్మాడు.  

ఇక దీని కి సంబంధించిన వీడియోని వ‌హాబ్ రియాజ్ తన సోషల్‌ మీడియా లో పోస్ట్ చేశాడు. ఇలా అమ్ముతూంటే...తనకు చిన్నప్పటి రోజులు గుర్తుకు వస్తున్నాయంటూ కామెంట్‌ పెట్టాడు. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు, క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. ఒక మాజీ క్రికెటర్‌ అయి ఉండి.. మాములు వ్యక్తిగా ఇలా చేయడం చాలా గ్రేట్‌ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కాగా... వహాబ్ రియాజ్ 2015 ప్రపంచకప్‌లో అద్భుతమైన ఆటతీరును కనబరిచి అందరి మనసులు దోచుకున్నాడు. 2015 ప్రపంచకప్‌లో పాకి స్థాన్ తరఫున అత్యుత్తమ ప్రదర్శనతో వహాబ్ 16 వికెట్లు పడగొట్టాడు. ఇక పాస్ట్‌ బౌలర్‌ వహాబ్ రియాజ్‌ డిసెంబర్ 2020 లో  పాక్‌ జట్టుకు దూరమయ్యాడు. 36 ఏళ్ల ఈ ఫా స్ట్ బౌలర్ 27 టెస్టుల్లో 83 వికెట్లు తీశాడు. అలాగే... 91 వన్డేల్లో 120 వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో  36 టీ20ల్లో 34 వికెట్లు పడగొట్టి శబాష్‌ అనిపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: