అంతేకాకుండా ఐపీఎల్ లో కి కొత్త జట్లు వస్తూ ఉండగా ఇక ఆయా జట్లు కూడా నలుగురు ఆటగాళ్లు రిటైన్ చేసుకోవాల్సి ఉంది. ఇక ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మరికొన్ని రోజుల్లో మెగా వేలం ప్రారంభం కాబోతోంది. ఫిబ్రవరి మొదటివారంలో మెగా వేలం ఉండే అవకాశం ఉంది అంటూ అటు టాక్ వినిపిస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే మరికొన్ని రోజుల్లో మెగా జరుగుతుంది అనుకుంటున్న సమయంలో ఇటీవల ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ అభిమానులందరికీ షాకిచ్చాడు.. ఐపీఎల్ మెగా వేలానికి ముందు కీలక ప్రకటన చేశాడు ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ జో రూట్.
ఫిబ్రవరి లో జరగబోయే ఐ.పి.ఎల్ మెగా వేలం నుంచి తాను తప్పుకుంటున్నట్టు ఇటీవల ప్రకటించాడు. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలియజేశాడు. అయితే ఇప్పటి వరకు ఐపీఎల్ లో పాల్గొననీ జో రూట్ ఇక ఈ సారి మాత్రం మెగా వేలంలో పాల్గొనీ ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఇటీవలే ప్రతిష్టాత్మకమైన యాషెస్ సిరీస్లో ఘోర ఓటమి తర్వాత ఐపీఎల్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నానని తెలిపాడు. తన జట్టు కోసం చేయాల్సింది చాలా ఉందని.. అందుకే కుదిరినంత త్యాగం చేస్తున్నాను అంటూ జో రూట్ చెప్పుకొచ్చాడు.