బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ కొత్త సీజన్ శుక్రవారం నుంచి ప్రారంభమైంది. టోర్నమెంట్ రెండవ మ్యాచ్లో క్రికెట్ చరిత్రలో అత్యంత ప్రత్యేకమైన రనౌట్ చోటు చేసుకుంది. ఈమ్యాచ్ మినిస్టర్ గ్రూప్ ఢాకా, ఖుల్నా టైగర్స్ మధ్య జరిగినది. ఇందులో వెటరన్ బంగ్లాదేశ్ ఆల్రౌండర్ మెహముదుల్లా కెప్టెన్గా ఉన్న మినిస్టర్ గ్రూపు ఢాకా జట్టులో విండీస్ వెటరన్ రస్సెల్ సభ్యుడు. ఈ మ్యాచ్లో ఆండ్రీ రస్సెల్ ఆటతీరును చూడటానికి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కానీ అతని అద్భుతమైన రనౌట్ను చూసి షాక్ అయ్యారు.
తొలుత బ్యాటింగ్ చేసి ఎంజీడీ జట్టు 15వ ఓవర్లో ఆండ్రీ రస్సెల్ క్రీజులో ఉన్నాడు. అతనితో కలిసి జట్టు కెప్టెన్ మెహమదుల్లా బ్యాటింగ్ చేస్తూ ఉన్నాడు. ఈ ఓవర్లో తిసార పెరీరా బౌలింగ్ చేస్తున్న సమయంలో అతని చివరి బంతిని రస్సెల్ థర్డ్ మ్యాన్ వైపు ఆడాడు. ఒక పరుగు కోసం పరుగెత్తాడు. థర్డ్ మ్యాన్ ఫీల్డర్ బ్యాటింగ్ ఎండ్లోని స్టంప్లను లక్ష్యంగా చేసుకున్నాడు. బంతి నేరుగా స్టంప్లను తాకింది. మెహముదుల్లా క్రీజులోకి వచ్చాడు. కానీ బంతి స్టంప్లను తాకి నేరుగా నాన్ స్ట్రైకర్స్ ఎండ్ వైపు మళ్లడంతో స్టంప్లపైన ఉంచిన బెయిల్లు చెల్లా చెదురుగా పడ్డాయి. ఇది చూసిన అభిమానులందరూ ఆశ్చర్యపోయారు. రస్సెల్ అప్పటికే ఇంకా క్రీజులో లేడు.
తమీమ్ ఇక్బాల్ హాఫ్సెంచరీ ఈ దిగ్బ్రాంతికరమైన రనౌట్ స్కోర్పై కూడా ప్రభావం చూపలేదు. అద్బుతమైన ఆరంభం ఉన్నప్పటికీ జట్టు 200 మార్కును దాటలేకపోయింది. రస్సెల్ 3 బంతుల్లో 7 పరుగులు మాత్రమే చేశాడు. ఎంజీడీ తరుపున తమీమ్ ఇక్బాల్ వేగంగా 50 పరుగులు చేయగా.. సహచర ఓపెనర్ మహ్మద్ షాజాద్ 27 బంతుల్లో 42 పరుగులు చేసాడు. అతనితో పాటు కెప్టెన్ మెహముదుల్లా కూడా 20 బంతుల్లో 39 పరుగులు చేయడంతో ఆ జట్టు 6 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసినది.