టీమిండియాలో ఎన్నో ఏళ్ల పాటు సేవలు అందించి తన అద్భుతమైన ఆటతీరుతో క్రికెట్ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్రవేసుకున్నాడు యువరాజ్ సింగ్. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లో కి ఎంతో మంది క్రికెటర్లు వచ్చినప్పటికీ యువరాజ్ స్థానం  మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే. అంతలా తన ఆటతీరుతో అభిమానులను సంపాదించుకున్నాడు ఈ ఆటగాడు. క్యాన్సర్ మహమ్మారిని జయించి మళ్లీ జట్టులోకి పునరాగమనం చేయడం కేవలం యువరాజ్  కి మాత్రమే సాధ్యమైంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే అటు క్రికెట్ కి దూరంగా ఉంటున్నప్పటికీ సోషల్ మీడియా వేదికగా మాత్రం అభిమానులకు ఎప్పుడూ దగ్గరగా ఉంటాడు యువరాజ్ సింగ్. తన అభిప్రాయాలను భావాలను ఎప్పుడూ అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు.



 ఇకపోతే ఇటీవల టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అభిమానులందరికీ కూడా ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పాడు. తాను తండ్రి అయ్యాను అంటూ ఒక సంతోషకరమైన వార్తను అభిమానులతో పంచుకున్నాడు. తన భార్య హేజల్ కీచ్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది అంటూ తెలిపాడు యువరాజ్ సింగ్. అభిమానులు కుటుంబ సభ్యులు స్నేహితులు అందరితో కూడా ఈ విషయాన్ని పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. ఈ విషయాన్ని తన అధికారిక ట్విట్టర్ వేదికగా యువరాజ్ సింగ్ పంచుకోవడం గమనార్హం.


 అయితే ఈ ప్రపంచంలో కి ఓ చిన్నారి వచ్చిన సందర్భంగా తమ గోప్యతను అభిమానులు అందరూ గౌరవించాలంటు విజ్ఞప్తి చేయడం గమనార్హం. యువరాజ్ సింగ్ చెప్పిన శుభవార్త తో అభిమానులందరూ ఎంతగానో మురిసిపోయారు. ఇక సోషల్ మీడియా వేదికగా యువరాజ్ సింగ్ దంపతులకు అభినందనలు చెబుతున్నారు అభిమానులు.ఈ క్రమంలోనే ఇదే విషయంపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అభినందనలు సోదరా నువ్వు గొప్ప తండ్రివి అవుతావు చిన్నారిపై బోల్డంత ప్రేమ కురిపిస్తావు అంటూ అభినందనలు తెలుపడం గమనార్హం. కాగా 2016 సంవత్సరంలో యువరాజ్ హేజల్ కిచ్ లకు పెళ్లి జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: