దీని గురించే ప్రస్తుతం అందరూ చర్చించుకుంటున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మొన్నటి వరకూ భారత్లో ఐపీఎల్ జరుగుతుందా లేక యూఏఈలో జరుగుతుంది అన్న చర్చ మొదలయింది. ఇప్పుడు భారత్ లో వైరస్ ప్రభావం తగ్గడంతో ఇక ఇండియాలోనే ఐపీఎల్ నిర్వహించడం ఖాయం అన్నది తెలుస్తుంది. అయితే ఒకప్పటిలా ఎక్కువ వేదికలో కాకుండా కేవలం మహారాష్ట్ర కొన్ని వేదికలో ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోందట మ్ ఇటీవలే స్పోర్ట్స్ ఛానల్ క్రికెట్ బజ్ కొన్ని విషయాలను వెల్లడించింది. 70 మ్యాచ్లను ముంబైలోని వాంఖడే స్టేడియంలో నిర్వహించాలని భావిస్తున్నట్లు చెప్పింది.
అయితే దాదాపు 70 మ్యాచ్ లను వాంఖడే స్టేడియంలో నిర్వహించాలని అనుకోవడం పై ప్రస్తుతం మిగతా ఫ్రాంచైజీలు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. వాంఖడే స్టేడియం ముంబై ఇండియన్స్ టీం కి హోమ్ గ్రౌండ్ గా ఉంటుందని.. అక్కడ మ్యాచ్ నిర్వహిస్తే ఆ ఒక్క జట్టుకే కలిసి వస్తుందని అంటూ మిగతా ఫ్రాంచైజీలు బిసిసిఐకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మిగతా జట్లకు హోమ్ గ్రౌండ్ లు లేవని అయితే వాంఖడే స్టేడియంలో కాకుండా పూణే బ్రబోర్న్ స్టేడియంలో ముంబై ఆడితే ఎలాంటి అభ్యంతరం లేదు అని మిగతా ఫ్రాంచైజీలు అంటున్నాయట..