ప్రస్తుతం భారత క్రికెట్ లో కొనసాగుతున్న క్రికెటర్లలో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగివుంది విరాట్ కోహ్లీ అని నిర్మొహమాటంగా చెప్పవచ్చు. కేవలం మనదేశంలోనే కాదు అటు ప్రపంచవ్యాప్తంగా కూడా విరాట్ కోహ్లీ ఆటకు ఎంతోమంది ఫిదా అయిపోయి అభిమానించడం మొదలు పెట్టారు. అయితే మిగతా అభిమానుల సంగతి ఎలా ఉన్నా అటు బెంగళూరులో మాత్రం విరాట్ కోహ్లీకి అందరూ వీరాభిమానిలే. ఎందుకంటే ఐపీఎల్ లో మొదటి నుండి  బెంగళూరు జట్టులోనే తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వస్తున్నాడు విరాట్ కోహ్లీ. ఇక 2014 నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కెప్టెన్గా కూడా వ్యవహరించాడు.



 ఇక గత ఏడాది బెంగళూరు జట్టుకు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. కానీ ప్రస్తుతం జట్టులో కీలక ఆటగాడిగా మాత్రం కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి. ఇకపోతే ప్రస్తుతం భారత జట్టు శ్రీలంక తో టెస్టు సిరీస్ ఆడుతుంది. ఇక మొదటి టెస్టు మ్యాచ్ వాంఖడే వేదికగా జరిగింది. ఇక రెండవ టెస్ట్ మ్యాచ్ బెంగళూరు వేదికగా జరుగుతోంది. ఈ క్రమంలోనే బెంగుళూరులో విరాట్ కోహ్లీ టెస్ట్ మ్యాచ్ ఆడుతూ ఉండటంతో అక్కడి అభిమానులు అందరూ కూడా తరలివచ్చారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో విరాట్ కోహ్లీ కి ఘనస్వాగతం లభించింది. ఇక విరాట్ కోహ్లీ మైదానంలోకి ఎంటర్ అవ్వగానే ఒక్కసారిగా స్టేడియం మొత్తం దద్దరిల్లిపోయింది..



 ఇక ఇటీవలే శ్రీలంకతో జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్ లో భాగంగా తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేయడానికి మైదానంలోకి వచ్చాడు విరాట్ కోహ్లీ. ఈ క్రమంలోనే  స్టేడియం లో ఉన్న అభిమానులు అందరూ కూడా కేరింతలతో స్వాగతం పలికారు. దీంతో ఒక్కసారిగా స్టేడియం మొత్తం దద్దరిల్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియోని బిసిసిఐ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. ప్రస్తుత ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇది చూసిన తర్వాత హోమ్ గ్రౌండ్ అన్న తర్వాత కోహ్లీకి ఆ రేంజ్ లో స్వాగతం లేకపోతే ఎలా అంటూ అభిమానులు కామెంట్ పెడుతూ ఉండటం గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి: