ఐపీఎల్ సమరానికి అన్ని జట్లు సిద్ధమైపోతున్నాయ్. ఇప్పటికే విదేశీ ఆటగాళ్లతో పాటు స్వదేశీ ఆటగాళ్లు కూడా జట్టు క్యాంపులో కి చేరుకున్నారు. ఈ క్రమంలోనే ప్రాక్టీస్ లో మునిగి తేలుతున్నారు. ప్రతి జట్టు ఫ్రాంచైజీ కూడా తమ జట్టు  ఆటగాళ్లు ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తున్నారు ఎవరు ఎంత అత్యుత్తమంగా రాణిస్తున్నారు అన్న విషయాలను తెలియజేస్తూ ప్రత్యర్థులకు వణుకు పుట్టించే విధంగా ఎన్నో వీడియోలను కూడా పోస్ట్ చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఇటీవలే ఒక వీడియో విడుదల చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోని యువ ఆటగాడు రిషబ్ పంత్ ప్రస్తుతం సారథ్య బాధ్యతలు నిర్వహిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే  జట్టులోని ఆటగాళ్ళలో స్పూర్తిని నింపుతూ ఉండడమే కాదు.. ప్రాక్టీస్ సెషన్లో చెమటోడుస్తున్నాడు యువ ఆటగాడు పంత్. ఇక దీనికి సంబంధించిన వీడియోను ఢిల్లీ ఫ్రాంచైజీ  ఇటీవల అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో విడుదల చేసింది. ఇక ఈ వీడియోలో చూసుకుంటే రిషబ్ పంత్ నెట్స్ లో ఎంత ప్రాక్టీస్ చేస్తున్నాడు అని అర్థమవుతుంది. ఇందులో రిషబ్ పంత్ బ్యాటింగ్ చేస్తూ ఉండగా యువ ఆటగాళ్లు సర్ఫరాజ్ ఖాన్, యష్ దుల్, కమలేష్ నాగార్కోటి అలా చూస్తుండిపోయారు అనే చెప్పాలి. రిషబ్ పంత్ ఎలా ఆడుతున్నాడు ఎంతో నిశితంగా గమనించారు. ఇటీవల శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్లో రిషబ్ పంత్ అద్భుతంగా రాణించాడు అన్న విషయం తెలిసిందే.


 ఇక బెంగళూరు వేదికగా ఈ పింక్ బాల్ టెస్ట్ పూర్తయిన వెంటనే ఢిల్లీ కాపిటల్స్ క్యాంపు లో చేరిపోయాడు కెప్టెన్ రిషబ్ పంత్. ముంబైలోని తాజ్ ప్యాలెస్ లో బస చేస్తుంది ఢిల్లీ జట్టు. ఈ క్రమంలోని ఇక ఇటీవల విడుదల చేసిన వీడియోలో రిషబ్ పంత్ భారీ సిక్సర్లు కొడుతూ   ఉండటం కనిపిస్తుంది. పక్కనే ఉన్న ఆటగాళ్లు రిషబ్ పంత్ ఆటను చూస్తూ వావ్ వాట్ ఏ షాట్ అంటూ ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. కాగా మార్చి 26వ తేదీ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కాబోతుంది. మొదటి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ కోల్కతా నైట్రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగితే.. ఇక రెండో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: