కాగా ఈ దిగ్గజ జట్ల మధ్య నిన్న ముంబైలోని డివై పాటిల్ స్టేడియం వేదికగా మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ రెండు జట్లు ఈ సారి పేలవా ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఉండడంతో ఈ ఛాంపియన్ జట్ల మధ్య మ్యాచ్ కూడా పస లేకుండానే ఉంటుంది అని అందరూ అనుకుంటారు. కానీ ప్రేక్షకులందరినీ కన్నార్పకుండా చేసింది. ఎంతో మంది ప్రేక్షకులను ఉత్కంఠతో మునివేళ్ళపై నిలబెట్టింది. ఇక చివరి బంతి వరకు ఎవరు విజయం సాధిస్తారో అనే విధం గా మారిపోయింది. నరాలు తెగే ఉత్కంఠత మధ్య జరిగిన ఈ పోరులో చివరికి చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది..
మూడు వికెట్ల తేడాతో ముంబై పై విజయఢంకా మోగించింది చెన్నై సూపర్ కింగ్స్. రాబిన్ ఉతప్ప 30 అంబటి రాయుడు 40 పరుగులతో రాణించారు చివర్లో ధోని 19 బంతుల్లో 28 పరుగులతో తనదైన శైలిలో ఫినిషింగ్ ఇచ్చాడు. ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో రెండో విజయాన్ని నమోదు చేసింది చెన్నై. అయితే ఇప్పటి వరకు చెన్నై రెండో విజయాన్ని నమోదు చేస్తే అటు చాంపియన్ ముంబై ఇండియన్స్ మాత్రం ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయకపోవడం గమనార్హం. కనీసం చెన్నై తో జరిగిన మ్యాచ్ లో అయినా గెలిచి సత్తా చాటుతుంది అనుకుంటే ముంబై ఇండియన్స్ కి మళ్ళీ నిరాశే ఎదురైంది. దీంతో ఇక ముంబై ఇండియన్స్ కి ప్లే ఆఫ్ అవకాశాలు పూర్తిగా కనుమరుగయ్యాయి అని చెప్పాలి..