ఐపీఎల్ లో ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠభరితంగా మారిపోయింది. ఇక ప్రతి జట్టు హోరాహోరీగా పోరాడుతున్నాయి. ఈ క్రమంలోనే ప్లే ఆప్స్ లో చోటు దక్కించుకోవడానికి ప్రతి జట్టు ప్రయత్నాలు చేస్తూ ఉండడంతో పోరు మరింత రసవత్తరంగా మారిపోయింది. ఈ క్రమంలోనే మ్యాచ్ ఫలితం ఏ జట్టు వైపు ఉంటుంది అన్నది కూడా ఊహకందని విధంగానే మారిపోయింది. కాగా నిన్న వారాంతం కావడంతో శనివారం రోజున రెండు మ్యాచ్ లు జరిగాయ్. దీంతో క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా టీవీలకు అతుక్కుపోయారు.


 అయితే నేడు సండే కావడంతో ఈ ఆదివారాన్ని మరింత స్పెషల్ గా మార్చడానికి అటు రెండు మ్యాచ్ లు జరుగుతాయని ప్రేక్షకులు అనుకున్నారు. కానీ ఐపీఎల్ అభిమానులకు నిరాశ ఎదురైంది. ఈ రోజు కేవలం ఒకే మ్యాచ్ జరగబోతోంది. నేడు ఐపీఎల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఐపీఎల్ లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరగబోతోంది. ఇక ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది అని చెప్పాలి. ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ 7 మ్యాచ్ లు ఆడగా.. ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయింది. వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్ తప్పక విజయం సాధిస్తుందని ప్రతి మ్యాచ్లో అభిమానుల నమ్మకం పెట్టుకుంటున్నారు.


 కానీ నిరాశ ఎదురవుతుంది. కనీసం నేడు జరగబోయే మ్యాచ్ లో అయినా విజయం సాధించి పరువు నిలబెట్టుకోవాలని కసితో ఉంది ముంబై ఇండియన్స్ జట్టు. తమ పేరిట ఉన్న చెత్త రికార్డును  తుడిచి వేయాలని భావిస్తుంది. అదే సమయంలో పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో కొనసాగుతున్న లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఇక నేడు జరగబోయే మ్యాచులో గెలిచి ప్లే ఆఫ్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకోవాలని భావిస్తూ ఉంది. కాగా సాయంత్రం ఏడున్నర గంటలకు ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగబోతోంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl