ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ కఠిన నిబంధనల మధ్య టోర్ని నిర్వహిస్తుంది బిసిసీఐ. ఇలాంటి సమయంలోనే ఇక ఆటగాళ్లకు ఒత్తిడి లేకుండా ఉండేందుకు కొన్ని సరదా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాయి ఫ్రాంచైజీ లు. దీంతో కొన్ని ఫన్నీ ఇంటర్వ్యూలు కూడా జరుగుతూ ఉండటం గమనార్హం. ఇకపోతే ఈ ఏడాది పంజాబ్ టీం పేలవ ప్రదర్శన చేస్తూ ఉంది. మెగా వేలం తర్వాత కొత్త కెప్టెన్ కొత్త ఆట గాళ్లు జట్టులోకి రావడం తో ఈసారైనా కప్పు గెలుస్తుందని అనుకున్నారు అందరు. కానీ ఊహించని విధంగా మళ్లీ పేలవా ప్రదర్శన చేస్తూనే ఉంటుంది.



 ఇదంతా పక్కనపెడితే ప్రస్తుతం సీజన్లో కీలకమైన మ్యాచ్ లు జరుగుతున్న సమయంలో ఓ ఫన్నీ కార్యక్రమాన్ని నిర్వహించింది పంజాబ్ యాజమాన్యం. డూ ఇట్  లైక్ శశి పేరుతో సాగిన ఈ కార్యక్రమం ఎంతో ఫన్నీగా సాగిపోయింది అని చెప్పాలి. ఇందులో యాంకర్ శశి చెప్పే పాపులర్ హిందీ డైలాగులను పంజాబ్ కింగ్స్ విదేశీ ఆటగాళ్లు కెమెరా ముందు తమదైన స్టైల్లో చెప్పారు.  ఈ క్రమంలోనే సఫారీ బౌలర్ కగిసో రబాడా మాత్రం డైలాగ్స్ చెప్పేముందు నవ్వులు పూయించాడు అనే చెప్పాలి. ఇంటర్వ్యూ లో భాగంగా మీకు సల్మాన్ ఖాన్ తెలుసా అంటు యాంకర్ శశి రబడా ను అడుగుతుంది.


 ఈ క్రమంలోనే ఫన్నీ రిప్లై ఇచ్చాడు. ఆ సల్మాన్ ఖాన్ ఎవరో నాకు తెలియదు కానీ రషీద్ ఖాన్ అయితే తెలుసు అని చమత్కరించాడు. ఇక ఆ తర్వాత సల్మాన్ ఖాన్ బాలీవుడ్ హీరో అంటూ రబడాకు చెప్పింది యాంకర్ శశి.  ఆ తర్వాత సల్మాన్ ఖాన్ సినిమా లోని పాపులర్ డైలాగ్ ని ఇక రబడాతో చెప్పించింది. ఏక్ బార్ మై జో కమిట్మెంట్ కర్ ది అనే డైలాగ్ను చెప్పించింది. ఇది దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.  కాగా ఈ సీజన్లో మెగా వేలంలో 9.25 కోట్లకి పంజాబ్కింగ్స్ రబడాను దక్కించుకోవడం గమనార్హం. ఇప్పటివరకు ఈ సీజన్లో 18 వికెట్లు పడగొట్టాడు ఈ ఫేస్ బౌలర్..

మరింత సమాచారం తెలుసుకోండి: