ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ యజమాన్యం ఒక వీడియో ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ క్రమంలోనే శ్రీలంక క్రికెటర్ మహీష్ తీక్షణ తాను అండర్ నైన్ టీన్ జట్టులో ఉన్న సమయంలో పడిన ఇబ్బందులను గుర్తుచేసుకున్నాడు. అండర్ నైన్ టీన్ క్రికెట్ జట్టుకు ఆడే సమయంలో 107 కేజీల బరువు ఉండేవాడిని అంటూ చెప్పుకొచ్చాడు. కానీ అంత బరువు తో ఇక క్రికెట్లో కొనసాగడం కష్టమని తెలుసుకున్న తర్వాత బరువు తగ్గడానికి ఎంతో కష్టపడ్డాను అంటూ మహీష్ తీక్షణ చెప్పుకొచ్చాడు. ఇక యో యో టెస్టు సమయంలో నా చర్మం ముడతలు పడి పోయేది. 2020లో పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించాను.
మళ్లీ బరువు పెరగకుండా ఉండేందుకు ఎంతో కష్టపడ్డాను అంటూ చెప్పుకొచ్చాడు ఈ శ్రీలంక క్రికెటర్. 2021లో శ్రీలంక తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశం వచ్చింది. దక్షిణాఫ్రికాతో వన్డే మ్యాచ్ ఆడే అవకాశం దక్కింది అంటూ తెలిపాడు. మిస్టరీ స్పిన్నర్ గా గుర్తింపు సంపాదించుకున్న అజింతా మొండిస్ మూడేళ్ల నుంచి నాకు కోచింగ్ ఇస్తున్నాడు అంటూ చెప్పుకొచ్చాడు 2022 లో మహేంద్ర సింగ్ ధోనీ తో మాట్లాడాను. అయితే మెగా వేలంలో చెన్నై జట్టు తీసుకుంటుందని మాత్రం కలలో కూడా ఊహించలేదు అంటూ చెప్పుకొచ్చాడు.