అయితే ఖచ్చితంగా అన్ని మ్యాచ్ లు గెలవాల్సిందే. అంత కన్నా ముందు ఈ మ్యాచ్ లో మొదట గెలవాలి. అయితే మొదట బ్యాటింగ్ చేసిన కోల్కతా టీమ్ మళ్ళీ తడబడింది. అయితే చివర్లో రస్సెల్ (49) ఎప్పటిలాగే విలువైన ఇన్నింగ్స్ తో ఆదుకోగా అతనికి బిల్లింగ్స్ (34) పరుగులతో చక్కని సహకారం అందించాడు. సన్ రైజర్స్ బౌలర్లు సమర్థవంతంగా బౌలింగ్ చేసి బాగా కట్టడి చేశారు. ముఖ్యంగా క్రికెట్ లో ఉసేన్ బోల్ట్ గా పేరు గాంచిన ఉమ్రాన్ మాలిక్ 3 వికెట్లతో చెరిగాడు. మొన్న బాగానే ఆడినట్లు కనిపించిన వెంకటేష్ అయ్యర్ ఈ మ్యాచ్ లో ఫెయిల్ అయ్యాడు.
ఇక రహానే, నితీష్ రానా లు ఆరంభాలు దక్కిన పెద్ద స్కోర్ చేయలేక చతికిలబడ్డారు. రింకు సింగ్ మరియు శ్రేయాస్ అయ్యర్ ఫెయిల్ అయ్యారు. అలా చివరికి కోల్కతా 177 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ను ముగించింది. ఇక సన్ రైజర్స్ ఆటగాళ్లు ఈ స్కోర్ ను ఛేదిస్తారా ? లేదా శ్రేయస్ సేన ఈ స్కోర్ ను డిపెండ్ చేస్తుందా అన్నది చూడాలి.