ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా ప్రతీ మ్యాచ్ ఎంతో రసవత్తరంగా జరుగుతోంది. ప్రస్తుతం లీగ్ మ్యాచ్ లూ ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో ఏ జట్టు కు ప్లే ఆఫ్ చేరుతుందా అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఛాంపియన్ జట్లు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు ఇప్పటికే వరుస ఓటములతో ఐపీఎల్ నుంచి నిష్క్రమించాయన్న  విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు పరువు నిలబెట్టుకోవడానికి కేవలం నామమాత్రపు మ్యాచ్ లు మాత్రమే ఆడుతున్నాయి ఈ రెండు జట్లు.


 ఇకపోతే నేడు ఆదివారం కావడంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా డబుల్ ధమాకా జరగబోతుంది. ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకి చెన్నై సూపర్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. ప్రస్తుతం గుజరాత్ జట్టు మ్యాచ్ లలో 9 విజయాలతో  ఇప్పటికే ప్లే ఆఫ్ లో అడుగు పెట్టిన మొదటి జట్టు గా నిలిచింది. అదే సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ ఇటీవలే ముంబై ఇండియన్స్ తో ఓడిపోయింది. ఐపీఎల్ నుంచి నిష్క్రమించింది. కాగా నేడు ఆడబోయే మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అనేది హాట్ టాపిక్ గా మారిపోయింది.


 మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. అదే సమయంలో ఇక రాత్రి ఏడున్నర గంటలకు లక్నో సూపర్ జెయింట్స్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగబోతోంది. ఇక లక్నో సూపర్ జెయింట్స్ జట్టు పాయింట్స్ టేబుల్ లో  రెండవ స్థానంలో కొనసాగుతుండగా అటు రాజస్థాన్ రాయల్స్ జట్టు కూడా ఎంతో పటిష్టంగా కనబడుతూ మూడవ స్థానంలో ఉంది. దీంతో ఇక ఈ రెండు జట్ల మధ్య జరగబోయే మ్యాచ్ కూడా ఎంతో ఆసక్తికరంగా మారబోతుంది. ఇక అదిరిపోయే ఉత్కంఠభరితమైన మ్యాచ్ లను చూసేందుకు సిద్ధమైపోయారు క్రికెట్ ప్రేక్షకులు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl