ధోని నిర్మించబోయే సినిమా లో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది అన్న టాక్ కూడా వినిపించింది. ఇక ఇప్పుడు మరో స్టార్ క్రికెటర్ అటు సినిమాల్లోకి రాబోతున్నాడు అన్న ఒక వార్త వైరల్ గా మారి పోయింది. అయితే ఈ క్రికెటర్ మాత్రం నిర్మాతగా కాదు ఏకంగా నటుడిగానే ఎంట్రీ ఇవ్వ బోతున్నాడట. ఆ స్టార్ క్రికెటర్ ఎవరో కాదు ప్రస్తుతం టీమిండియా లో డేరింగ్ ఓపెనర్గా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న శిఖర్ ధావన్. శిఖర్ ధావన్ త్వరలో బాలీవుడ్లో ఓ సినిమాలో నటుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
దీనికి సంబంధించిన వార్త కాస్త ప్రస్తుతం సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం అక్షయ్ కుమార్ రామసేతు అనే సినిమాలో నటిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలోని కీలక పాత్ర లో శిఖర్ ధావన్ కనిపించ బోతున్నాడట. ఇక శిఖర్ధావన్ పాత్ర ఈ సినిమా లో ఎంతో కీలకమైనదని.. ఆయన పాత్ర మీదే సినిమా కథ ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ పాత్రకి శిఖర్ ధావన్ అయితేనే కరెక్టుగా సరి పోతాడు అని చిత్రబృందం భావించిందట. అందుకే అతని తీసుకుంటున్నారట. ఇది ఎంతవరకు నిజం అన్నది మాత్రం అఫీషియల్ ప్రకటన వచ్చే వరకు తెలియదు..