ఐపిఎల్ సీజన్ 15 లో ఎంతో గొప్ప గొప్ప రికార్డులు ఉన్న ముంబై ఇండియన్స్ దారుణంగా విఫలం అయింది. సగం టోర్నీ పూర్తి కాగానే ముంబై ప్లే ఆఫ్ ఆశలు ఆవిరి అయిపోయాయి. వరుసగా మ్యాచ్ లు ఓడిపోయి అటు అభిమానులు ఇటు జట్టు యాజమాన్యం ఆశలను బూడిద పాలు చేశారు. అన్నింటికన్నా కెప్టెన్ రోహిత్ శర్మ కెప్టెన్ గా ఆటగాడిగా వైఫల్యం చెందడం తీవ్ర నిరాశను కలిగించింది. బుమ్రా సైతం మునుపటిలా బ్యాట్స్మన్ ను ఇబ్బంది పెట్టలేకపోయాడు. ఇక 17 కోట్లకు కొనుక్కున్న ఇషాన్ కిషన్ సంగతి సరేసరి... అంచనాలకు మించి రాణించడంలో ఫెయిల్ అయ్యాడు. అలా వివిధ కారణాలతో ముంబై ప్లే ఆఫ్ రేస్ నుండి నిష్క్రమించింది.

కాగా పాయింట్ల పట్టికలో కనీసం మంచి స్థానాన్ని అయినా పొందుతుందని అనుకుంటే... అదికూడా జరిగేలా కనిపించడం లేదు. ప్రస్తుతం 13 మ్యాచ్ లలో 3 మాత్రమే గెలిచి చివరి స్థానంలో దర్జాగా ఉంది. కాగా ఇప్పుడు ఒక విషయం బాగా వైరల్ అవుతోంది. ఎలాగూ ప్లే ఆఫ్ కు వెళ్ళడం లేదు కాబట్టి బెంచ్ మీద ఉన్న పూర్తి స్క్వాడ్ ను అయినా ఆడిస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. అందులో భాగంగా ముంబై ఇండియన్స్ లో ఫాస్ట్ బౌలర్ గా ఉన్న సచిన్ కొడుకు అర్జున్ టెండూల్కర్ కు అవకాశం ఇవ్వాలని సోషల్ మీడియాలో పోస్ట్ లు మీద పోస్ట్ లు పెడుతున్నారు. ఈ టోర్నీలో ముంబైకి మిగిలింది ఒకే ఒక్క  మ్యాచ్... ఈ మ్యాచ్ లో అయినా అర్జున్ ను రోహిత్ ఆడిస్తాడా లేదా అన్నది చూడాల్సింది.

అయితే ఈ మ్యాచ్ ఢిల్లీ కి చాలా కీలకం కానుంది. ఇందులో గెలిస్తెనేనే ప్లే ఆఫ్ కు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది.  లేదంటే... ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తోంది. మరి ఈ సమయంలో ముంబై ఢిల్లీ కి ఫేవర్ చేస్తుందా అన్నది వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: