ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో భాగంగా ఐదు సార్లు టైటిల్ విజేత గా నిలిచి ఛాంపియన్గా కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ జట్టు పేలవ ప్రదర్శన కొనసాగిస్తోంది అన్న విషయం తెలిసిందే. అద్భుతంగా రాణించి కప్ గెలుస్తుంది అనుకోవద్దు కనీసం ప్లే ఆప్ కి కూడా అవకాశాలు దక్కించుకోలేక  పోయింది. వరుసగా పరాజయాల బాట పట్టింది ముంబై ఇండియన్స్ జట్టు ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే ముంబై ఇండియన్స్ ఎప్పుడు ఇలా గడ్డు పరిస్థితులను ఎదుర్కోలేదని చెప్పాలి.


  ఇటీవల సన్రైజర్స్ హైదరాబాద్ లో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టు చివరికి ఓటమి చవిచూసింది. అయితే ప్రస్తుతం ముంబై ఇండియన్స్ ఐపీఎల్ లో ఆడుతుంది కేవలం నామ మాత్రపు మ్యాచ్ లు మాత్రమే కావడంతో మొన్నటి వరకు బెంచ్ కి మాత్రమే పరిమితమైన యువ ఆటగాళ్లకు జట్టులో అవకాశం కొట్టేస్తున్నారు అని చెప్పాలి ఇక ఇటీవల ఇదే విషయంపై స్పందించిన టీమిండియా మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేసాడు. ఇండియామ్యాచ్ ఆడాల్సి ఉన్న నేపథ్యంలో  కలలు తెలుసుకుంటూ  విజయాలు సాధిస్తోంది ముంబై ఇండియన్స్.


 కానీ ఇటీవల సన్రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రం ఓటమి చవిచూసింది. కాగా ఈ ఏడాది 30 లక్షలకు అర్జున్ టెండూల్కర్ ను కొనుగోలు చేసింది. ఇటీవల హైదరాబాద్లో జరిగినా మ్యాచ్ లోనే అతన్ని తీసుకుంటారని  అభిమానులను అనుకున్నారు. ముంబై ఇండియన్స్ తుది జట్టులో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నప్పటికీ అర్జున్ కు చోటు దక్కలేదు అని చెప్పాలి. ఈ క్రమంలోనే స్పందించిన అకాష్అ చోప్రా.. అర్జున్టెం డూల్కర్ ను తప్పకుండా చివరి మ్యాచ్లో ఆడించాలని ఆకాష్ చోప్రా అన్నారు.
 ముంబై ఇండియన్స్ జట్టుకు ప్లే ఆఫ్ అవకాశాలు లేవు కాబట్టి..
 ప్రస్తుతం మొన్నటివరకు బెంచ్ కీ పరిమితమైన ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం వల్ల వారి ప్రతిభను నిరూపించుకునేందుకు ఎంతో మంది. యువకులకు అవకాశం దక్కుతుంది అభిప్రాయం వ్యక్తం చేసారు ఆకాశ్ చొప్రా. కాగా ముంబై ఇండియన్స్ ఏడాది కేవలం13 మ్యాచ్ లాడి మూడు విజయాలు మాత్రమే సాధించింది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: