ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా ఇటీవల గుజరాత్ టైటాన్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మ్యాచ్ జరిగింది. ఇక ఈ మ్యాచ్లో అటు బెంగళూరు జట్టు ఘన విజయం అందుకుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇంకా ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. అయితే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో మ్యాచ్ లో గుజరాత్ ఇన్నింగ్స్ సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. గుజరాత్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా చేసిన పని మైదానంలో నవ్వులు పూయించింది అనే చెప్పాలి.



 ఏం జరిగిందంటే.. మాథ్యూ వేడ్   వికెట్ తీసిన మ్యాక్స్వెల్ మంచి లైన్ అండ్ లెన్స్ తో బంతిని వేస్తూ ఉన్నాడు. ఈక్రమంలోనే ఇన్నింగ్స్ 10 ఓవర్లు బౌలింగ్ కు వచ్చిన మ్యాక్స్వెల్ హార్దిక్ పాండ్యా వికెట్ పడగొట్టడమే లక్ష్యంగా  బంతులు సంధించాడు. కాగా అప్పటికి హార్దిక్ పాండ్య డేవిడ్ మిల్లర్ లు కలిసి ఒక ఓవర్లో 7 పరుగులు రాబట్టారు.  ఈ క్రమంలోనే హార్దిక్ పాండ్యా స్వీప్ షాట్ షాట్ ఆడేందుకు ప్రయత్నించారూ. అయితే బంతి బ్యాట్ కు తాగడంలో విఫలమయింది. ఈ నేపథ్యంలోనే బంతి గాలిలో ఎగరడానికి బదులుగా ఏకంగా హార్దిక్ పాండ్యా చేతిలో ఉన్న బ్యాట్ గాలిలోకి లేచి ఏకంగా వంద మీటర్ల దూరంలో పడింది.


 ఇక ఇది చూసి మైదానంలో ఉన్న ఆటగాళ్లందరూ కూడా నవ్వుకున్నారు. హార్దిక్ పాండ్యా కూడా తనలో తాను నవ్వుకున్నాడు అని చెప్పాలి. ఇక ఇలా జరిగిన సమయంలో డగౌట్ లో ఉండి మ్యాచ్ వీక్షిస్తున్న హార్దిక్ పాండ్యా భార్య నటాషా సైతం చిరునవ్వు నవ్వి ఏంటిది అన్నట్లుగా అక్కడినుంచి హార్దిక్ పాండ్యా కు సైగ చేసింది. దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది. అయితే ఈ మ్యాచ్ 62 పరుగులతో రాణించాడు హార్దిక్ పాండ్యా. గుజరాత్ కు మంచి స్కోరు అందించాడు.. అయినప్పటికీ ఇక ఎంతో అలవోకగా గుజరాత్ తమ ముందు ఉంచిన టార్గెట్ ఛేధించింది బెంగళూరు జట్టు.

మరింత సమాచారం తెలుసుకోండి: