ఈ క్రమంలోనే ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా కొత్త జట్టు ఛాంపియన్ గా అవతరించి పోతుంది అని తెలుస్తోంది. అయితే ఐపీఎల్ లో భాగంగా ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ లక్నో జట్లు ప్లే ఆఫ్ లో అడుగుపెట్టాయి. ఇక ఇటీవల ప్లే ఆఫ్ లో అడుగు పెట్టడానికి అడుగు దూరంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ ఆడింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు 150 పరుగులు మాత్రమే చేసింది.
ఈ క్రమంలోనే 151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు 19.4 ఓవర్లలోనే ఐదు వికెట్లు కోల్పోయి టార్గెట్ చేదించడం గమనార్హం. రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 59 పరుగులతో రాణించాడు. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 40 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇలా చెన్నై సూపర్ కింగ్స్ పై విజయం తో అటు పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కి దూసుకుపోయిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్లే యాప్ లో కూడా చోటు దక్కించుకోవడం గమనార్హం. ఈ క్రమంలోనే రాజస్థాన్ కప్పు గెలవాలని ఈ సారి బలంగా కోరుకుంటున్నారు అభిమానులు.