అయితే ఇటీవలే ఒక మ్యాచ్లో మాత్రం ఏకంగా 73 పరుగులు చేసి గుజరాత్ టైటాన్ పై వీరవిహారం చేశాడు మళ్లీ ఫాంలోకి వచ్చినట్లు కనిపించాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్లో ఇప్పటికే 14 మ్యాచ్ లూ ఆడిన బెంగళూరు జట్టు ఒకవేళ ప్లే ఆఫ్ కి వెళ్తే కోహ్లీ ఆటను చూసేందుకు అవకాశం ఉంటుంది. లేదంటే ఇక టీమిండియాలో చూసేందుకు మళ్ళీ కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇటీవల ఒక మ్యాచ్ సమయంలో ప్రస్తుతం పరుగుల వీరుడుగా టాప్ లో కొనసాగుతున్న బట్లర్ విరాట్ కోహ్లీ దగ్గరికి వచ్చి ఏదో మాట్లాడాడు. దీంతో బట్టర్ కోహ్లీనీ అడిగాడు అని అందరు చర్చించుకున్నారు.
ఇటీవల ఇదే విషయంపై విరాట్ కోహ్లీ ఆసక్తికర విషయాన్ని తెలిపాడు. ఓ మ్యాచ్ సందర్భంగా బట్లర్ వచ్చి నన్ను ఏదో అడగాలని అనుకున్నాడు. నేను స్పందిస్తూ నువ్వు ఇప్పటికే టోర్నీలో మంచి బ్యాటింగ్ చేస్తూ అగ్రస్థానంలో దూసుకుపోతున్నావ్. నేను ఇంకా రన్స్ చేయలేక ఇబ్బంది పడుతున్నాను. అలాంటి నువ్వు నన్ను ఏమి అడగాలి అనుకుంటున్నావ్ అంటూ బదులిచ్చా.. దీంతో ఇద్దరం నవ్వుకున్నాం అంటు విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. కాగా ప్రస్తుతం జోస్ బట్లర్ సెంచరీలతో చెలరేగి ఇక ఈ సీజన్ లో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా టాప్ లో ఉన్నాడు..