ఈ ఏడాది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఉత్కంఠ భరితమైన పరిస్థితి వచ్చింది. డుప్లెసిస్ కెప్టెన్సీ లో బరి లోకి దిగిన బెంగుళూరు మొదట్లో వరుస విజయాలు సాధించింది. ఆ తర్వాత మాత్రం వరుస పరాజయాల తో సతమతమయ్యింది. ఇల పడుతూ లేస్తూ ప్రయాణాన్ని కొనసాగించి  పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో కొనసాగుతోంది. ఈ క్రమంలోనే బెంగుళూరు  జట్టు ప్లే ఆఫ్ లో అడుగుపెడుతుందా లేదా అన్నది మాత్రం ప్రస్తుతం నేడు జరగబోయే మ్యాచ్ ఫలితంపై ఆధారపడి ఉంది అన్న విషయం తెలిసిందే.


 ఎందుకంటే నేడు ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది.  కాగా ప్రస్తుతం బెంగళూరు 8 విజయాలతో ఉంటే.. ఢిల్లీ కాపిటల్స్ 7 విజయాలతో ఐదవ స్థానంలో ఉంది. రన్ రేట్ మాత్రం అటు బెంగళూరు కంటే ఢిల్లీకి మెరుగ్గా ఉండటం గమనార్హం. దీంతో ఒకవేళ ఢిల్లీ కలిస్తే ఇక ఆర్సిబి ఐదవ స్థానంలోకీ.. ఢిల్లీ 4 వ స్థానం లోకి వెళుతుంది. దీంతో ఆర్సిబి ఇంటి బాట పట్టాల్సి ఉంటుంది. దీంతో నేడు జరగబోయే మ్యాచ్ ముంబై ఇండియన్స్ గెలవాలని ఎంతో బలంగా కోరుకుంటున్నారు ఆర్సిబి అభిమానులు, ఆటగాళ్లు.



 తాము ముంబై ఇండియన్స్ కి పూర్తి మద్దతు ఇస్తున్నాము అంటూ కోహ్లీ డుప్లెసిస్ సైతం చెప్పారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల ఇదే విషయంపై స్పందించిన మాజీ ఆటగాడు వసీం జాఫర్ ట్విట్టర్ వేదికగా పెట్టిన ఒక పోస్టు మాత్రం ప్రస్తుతం నవ్వులు పూయిస్తుంది. ఆట వాళ్ళది.. కానీ మ్యాచ్ మాత్రం మాది అంటూ ఒక క్యాప్షన్ కూడా జత చేస్తాడు. ఇలా మైదానంలో ఆడుతుంది ముంబై ఇండియన్స్ అయినప్పటికీ ఉత్కంఠ మాత్రం మాలో ఉంది అంటూ ఆర్సిబి అభిమానులు ఆటగాళ్లు ఎదురు చూస్తున్నట్లుగా ఈ పోస్ట్ లో మీనింగ్ ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

Rcb