ప్రస్తుతానికి మాత్రం మూడు జట్లు ప్లే ఆఫ్ లో చోటు దక్కించుకుని తర్వాత సమరానికి సిద్ధం అయ్యారు. ఆ జట్లలో మొదటి సారి ఐపీఎల్ లో అడుగు పెట్టిన గుజరాత్ టైటాన్స్ మొదటి స్థానంలో ఉండగా, ఇంకొక జట్టు లక్నో సూపర్ జాయింట్స్ మూడవ స్థానంలో ఉంది. ఇక ఐపీఎల్ మొదటి సీజన్ లో ట్రోపీని సాధించిన రాజస్థాన్ రాయల్స్ మాత్రం రెండవ స్థానంలో కొనసాగుతోంది. ఇక మిగిలింది ఒక్క నాలుగవ స్థానం మాత్రమే. అయితే ఈ స్థానం ఎవరికి దక్కనుంది అని తెలియాలంటే ఈ రోజు జరిగే మ్యాచ్ ఫలితం వచ్చే వరకు ఆగాల్సిందే.
ఇంకాసేపట్లో మ్యాచ్ స్టార్ట్ కానుండగా గెలుపు కోసం రెండు జట్లు బరిలోకి దిగనున్నాయి. అయితే ఈ మ్యాచ్ లో ముంబై గెలవాలని బెంగుళూరు అభిమానులు మరియు ముంబై అభిమానులు ఇద్దరూ కోరుకుంటున్నారు. దీనితో ఢిల్లీకి ఒకే ఒక్క అభిమానం దక్కనుంది. సో... ఫ్యాన్స్ బలం మాత్రం ముంబై కి ఎక్కువగా ఉండనుంది. అయితే ఈ సమరంలో గెలుపు ఎవరిని వరిస్తుంది అనేది చూడాలి. ఆత్యదిక ఫ్యాన్ బలం ఉన్న ముంబై ని ఢిల్లీ ఓడిస్తుందా అన్నది ఒక ప్రశ్నగా మిగిలింది.