ప్రస్తుతం యువ ఆటగాళ్ల నుంచి తీవ్రమైన పోటీ పెరిగి పోయిన నేపథ్యంలో ఇక సీనియర్ అయిన శిఖర్ ధావన్ కు చోటు దక్కడం కష్టంగా మారి పోయింది అని చెప్పాలి. ఈ క్రమం లోనే రానున్న రోజుల్లో అయినా అతనికి టీమిండియా లో చోటు దక్కుతుందా లేదా అన్నది మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే శిఖర్ ధావన్ రిటైర్మెంట్ ప్రకటిస్తాడు అనే చర్చ కూడా తెరమీదికి వచ్చింది. ఈ క్రమంలోనే ఇటీవల ఇదే విషయంపై స్పందించిన వార్నర్ తన భవిష్యత్తు గురించి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అభిమానులు ఆందోళన చెందాల్సిన పని లేదని మరో మూడేళ్ల పాటు క్రికెట్ తప్పకుండా ఆడుతాను అంటూ స్పష్టం చేశాడు.
టీ-20 ఫార్మెట్లో రాణించగలను అంటూ విశ్వాసం వ్యక్తం చేశాడు శిఖర్ ధావన్. అన్నీ ఫార్మాట్ లలో కూడా నిలకడగానే ఉన్నాను అంటు చెప్పుకొచ్చాడు. కాగా ప్రస్తుతం ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతున్న శిఖర్ ధావన్ ఓపెనర్గా తన ప్రదర్శన తో ఆకట్టుకుంటున్నాడు అని చెప్పాలి. ఇక అతని ప్రదర్శన చూసిన తరువాత రానున్న రోజుల్లో టీమిండియా లో అతనికి చోటు దక్కడం ఖాయమని అభిమానులు కూడా బలం గా నమ్ముతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.