ఒక క్రీడా ఛానల్ తో మాట్లాడుతూ వీరేంద్ర సెహ్వాగ్ సరదాగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. లీక్ స్టేజ్ దశలో ముంబై ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ గెలవడం అటు పార్థివ్ పటేల్ కు అస్సలు ఇష్టం లేదని.. అలా జరగడం వల్ల బెంగళూరు జట్టు ఇంటిముఖం పడుతుందని ఆశించాడు అంటు సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు. అయితే చివరికి ముంబై గెలిచేది బెంగళూరు ప్లే ఆఫ్లో అడుగుపెట్టడంతో ఇక బెంగుళూర్ అభిమానులు తనపై మండిపడ్డారు అంటూ చెప్పుకొచ్చాడు పార్థివ్ పటేల్.
అయితే తాను ఎప్పుడూ కూడా బెంగళూరు జట్టు ప్లే ఆప్ లో అడుగు పెట్టాలని కోరుకుంటున్నాను అంటూ వివరణ ఇచ్చాడు. నమ్మకం కలగాలంటే తన ఇంస్టాగ్రామ్ లో రీల్స్ కూడా చూడొచ్చు నేను మొదటి నుంచి బెంగళూరు జట్టు రెండవ స్థానంలో నిలవాలని కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు. బెంగళూరు జట్టు ప్లే ఆఫ్ కి వెళ్లడం నాకు నచ్చదు అని పుకార్లు ఎన్నో వచ్చాయని తెలిపాడు. అంతేకాకుండా ఇక బెంగళూరు ఢిల్లీ మధ్య మ్యాచ్ లో కూడా ముంబై గెలవాలని ఆ జట్టు జెర్సీ వేసుకుని స్టేడియంకు వెళ్లి మరీ సపోర్ట్ చేశాను అని చెప్పుకొచ్చాడు. దీంతో అభిమానులు అందరూ కూడా శాంతించారు చెప్పాలి..