ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదలైందంటే చాలు క్రికెట్ ప్రేక్షకులకు అసలైన క్రికెట్ ఎంటర్టైన్మెంట్ అందుతు ఉంటుంది. అయితే గత రెండు సీజన్లలో కూడా కరోనా వైరస్ కారణంగా స్టేడియంలో ప్రేక్షకులకు అనుమతి లేకుండా పోయింది. ఈ ఏడాది మాత్రం ప్రేక్షకులను అనుమతించడంతో ఎంతోమంది క్రికెట్ అభిమానులు మ్యాచును వీక్షించేందుకు స్టేడియం కు తరలి వెళ్లారు. స్టేడియం కి వెళ్ళిన అభిమానులు తమకు నచ్చిన విధంగా ప్లకార్డులు ప్రదర్శించడం లాంటివి చేస్తూ కెమెరాలకి చిక్కుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే కొంత మంది ప్రేక్షకులు ప్రదర్శించిన ప్లకార్డులు ఎంతో మంది దృష్టిని ఆకర్షిస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి. అయితే గతంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మ్యాచ్ ఆడుతున్న సమయంలో ఒక మహిళ అభిమాని ఒక ప్లకార్డు పట్టుకుని కనిపించింది.  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ టైటిల్ విజయం సాధించేంత వరకు తాను పెళ్లి చేసుకోను అంటూ రాసి ఉంది   ఇక ఇది చూసిన నెటిజన్లు వామ్మో ఈ యువతి మంగమ్మ శపతం బాగానే చేస్తుంది. ఆర్సిబి ఒకవేళ ఓడిపోతే పరిస్థితి ఏంటో అని అనుకున్నారు.


 చివరికేజ్ అందరూ అనుకున్నదే జరిగింది. ముంబై ఇండియన్స్ కారణంగా అదృష్టవశాత్తు ప్లే ఆఫ్లో అడుగుపెట్టింది బెంగళూరు. ఆ తర్వాత ఎలిమినేటర్ మ్యాచ్ లో లాక్కున్నట్టు మంచి విజయాన్ని లక్నో తో రెండవ క్వాలిఫైయింగ్ మ్యాచ్ లో మాత్రం రాజస్థాన్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. దీంతో ఐపీఎల్ నుంచి నిష్క్రమించింది  దీంతో ఇక ఒకప్పుడు అమ్మాయి పట్టుకున్న ప్లకార్డును గుర్తు చేసుకుంటూ ఇక ఆ అమ్మాయికి పెళ్లి అవడం కష్టమేనా అంటు ఫన్నీ కామెంట్ చేస్తూ ఉన్నారు నేటిజన్స్. దీంతో మరోసారి ఈ ఆర్సిబి మహిళా అభిమాని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl