మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్నా ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం ఆయన ఆటను మాత్రమే కాదు ఆయన వ్యక్తిత్వాన్ని కూడా అభిమానులు ఎంతగానో ఇష్టపడుతూ ఉంటారు.  మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఎప్పుడూ అభిమానులు గర్వ పడే పనులు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు వరకు మహేంద్రసింగ్ ధోని ఎన్నోసార్లు అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చిన ఘటనలు ఎన్నో ఉన్నాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు ధోనీ మరోసారి అభిమానులు గర్వపడే పనిచేశాడు.


 ఇప్పటికే ఎన్నోసార్లు తన అభిమానులను కలిసిన ధోని ఇక ఇటీవల ఒక ప్రత్యేకమైన అభిమాని కోరిక తీర్చాడు. పుట్టుకతోనే అంగవైకల్యం బారిన పడిన లావణ్యకు ధోని అంటే విపరీతమైన అభిమానం. ఈ క్రమంలోనే ధోని బొమ్మను గీసి అతనికి బహుమతిగా ఇవ్వాలని ఎంతగానో ఆశ పెట్టుకుంది. అయితే ఈ విషయం మహేంద్రసింగ్ ధోని కి తెలిసింది. అభిమానులు అంటే ప్రాణం ఇచ్చే ధోని ఊరుకుంటాడా స్వయంగా లావణ్య దగ్గరికి వెళ్లి కలిశాడు. దీంతో ఆ అభిమాని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పాలి.


 ఇక ఆ తర్వాత లావణ్య తన అభిమాన క్రికెటర్ ధోనీ కి సంబంధించి గీసిన బొమ్మ ను అతనికి బహుమతిగా ఇచ్చింది. ఈ క్రమంలోనే లావణ్య చేతులను దగ్గరికి తీసుకోవడం కన్నీళ్లను తుడవటం..  అంతేకాకుండా లావణ్య తన బొమ్మను గీసినందుకు అభినందనలు తెలిపాడు. ఇక ఈ మధురమైన క్షణాలను ఆమె తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది. ఆయన చేతులు తడుముతూ ఏడవకూడదు జీవితాన్ని ఆనందంగా గడపాలి అంటూ చెప్పారు. బొమ్మ గీసినందుకు థాంక్యూ చెప్పారు. తన విలువైన సమయాన్ని నా కోసం కేటాయించారు. ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసి ధోని అభిమానులందరూ మరింత గర్వపడుతున్నారూ అనే చెప్పాలీ.

మరింత సమాచారం తెలుసుకోండి: