జూన్ 9వ తేదీ నుంచి టీమ్ ఇండియా సౌత్ఆఫ్రికా తో సొంతగడ్డపై టి20 సిరీస్ ఆడనుంది. ఇక 20 సిరీస్ లో భాగంగా విరాట్ కోహ్లీ జస్ప్రిత్ బూమ్రా రోహిత్ శర్మ లాంటి సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతిని ఇచ్చారు బిసిసిఐ సెలెక్టర్లు. అదే సమయంలో ఇక మొన్నటికి మొన్న ఐపీఎల్ లో మంచి ప్రదర్శన చేసిన యువ ఆటగాళ్లకు జట్టులో చోటు కల్పించారు. వైస్ కెప్టెన్ కె.ఎల్.రాహుల్ ప్రస్తుతం టీమిండియాకు తాత్కాలిక కెప్టెన్ గా వ్యవహరించపోతున్నాడు అని తెలుస్తోంది.


 అయితే సౌత్ ఆఫ్రికా తో టి20 సిరీస్ నేపథ్యంలో ప్రస్తుతం అందరి కన్ను కూడా ఒక ఆటగాడి పై ఉంది. అతను ఎవరో కాదు హార్దిక్ పాండ్యా. ఈ ఏడాదికి టీ20 ప్రపంచకప్ తర్వాత  భారత జట్టుకు పూర్తి గా దూరం అయిపోయాడు. గాయాల బెడద సర్జరీలూ అతన్ని క్రికెట్కు దూరం చేసాయి. ఇలాంటి సమయంలోనే ఐపీఎల్లో మైదానంలోకి అడుగుపెట్టిన హార్దిక్ పాండ్యా గుజరాత్ జట్టును  కెప్టెన్గా ముందుకు నడిపించడమే కాదు ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. గుజరాత్ జట్టుకు టైటిల్ కూడా అందించాడు అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోని సౌత్ ఆఫ్రికా తో టి20 సిరీస్ లో అతను ఎలా రాణించ బోతున్నాడు అని   ఆసక్తిగా  చూస్తున్నారు ప్రేక్షకులు. ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భాగంగా తన కెరీర్ గురించి హార్దిక్ పాండ్యా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన పై ఎంతో నమ్మకం ఉంచేవాడు అంటూ హార్థిక్ పాండ్య తెలిపాడు. నా అరంగేట్ర టి20 మ్యాచ్ ఆస్ట్రేలియా పై ఆడాను. ఇక తొలి ఓవర్లో 21 పరుగులు సమర్పించుకున్నా. దీంతో అక్కడితో కెరీర్ ముగిసిపోయింది. అదే నా చివరి ఓవర్ అనుకున్నాను. కానీ ధోని ఏమీ అనలేదు. సిరీస్ తర్వాత ప్రపంచ కప్ టీం లో నువ్వు ఉంటావు అని  చెప్పడంతో ఆశ్చర్యపోయాను. మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో ఆడటం నా అదృష్టంగా భావిస్తున్నా అంటూ హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: