అయితే ఈ రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్ లో ఏడు వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది బెంగాల్ జట్టు. అయితే టీమిండియా క్రికెటర్ బెంగాల్ క్రీడా మంత్రి అయినా మనోజ్ తివారి సెంచరీ తో ఆకట్టుకోవటం హాట్ టాపిక్ గా మారి పోయింది అని చెప్పాలి. 129 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న బెంగాల్ జట్టు చాలా అద్భుతమైన సెంచరీ తో గట్టెక్కించాడు మనోజ్ తివారి. 152 బంతుల్లో 14 ఫోర్లు ఒక సిక్సర్ సాయం తో సెంచరీని అందుకున్నాడు.
ఇక మొత్తం గా 185 బంతుల్లో 19 ఫోర్లు 2 సిక్సర్లు సహాయం తో 136 పరుగులు చేశాడు మనోజ్ తివారి. ఇలా టీమిండియాలో ఎక్కువగా సక్సెస్ కాకపోయినప్పటికీ జట్టు రంజీ ట్రోఫీలో ఆడి ఏకంగా క్రీడాశాఖ మంత్రిగా కొనసాగుతున్న సమయంలో మంచి ప్రదర్శన చేసి సెంచరీతో ఆకట్టుకోవడంతో ప్రస్తుతం మనోజ్ తివారీ చేసిన ప్రదర్శన కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.