ఉత్కంఠ భరితంగా క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయం లో కొంత మంది అభిమానులు అత్యుత్సాహం చూపుతూ సెక్యూరిటీ దాటుకుని మైదానం లోకి పరిగెత్తు  కుంటూ వస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. తమ అభిమాన క్రికెటర్ ను ఒక్కసారి దగ్గర నుంచి చూసి కలిస్తే చాలు అని భావిస్తూ ఉంటారు. అయితే ఒకప్పుడు ఇలా మైదానం లోకి వచ్చిన అభిమానులు దగ్గరికి తీసుకొని ఒక హాగ్ ఇచ్చి పంపించే వాళ్ళు క్రికెటర్లు. కానీ ఇప్పుడు కరోనా వైరస్ కారణం గా అభిమానులు పరిగెత్తు కుంటూ వచ్చినా దగ్గరికి మాత్రం రానివ్వడం లేదు.


 కానీ కొన్ని కొన్ని సార్లు ఇలా మైదానం లోకి వచ్చిన అభిమానులకు ఊహించని బహుమతులు ఇస్తూ ఉంటారు క్రికెటర్లు. ఇక్కడ కూడా ఇలాంటిదే జరిగింది. పాకిస్తాన్ వెస్టిండీస్ మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయం లో ఒక అభిమాని సెక్యూరిటీనీ దాటుకుని మైదానం లో కి వెళ్ళాడు. తన అభిమాన క్రికెటర్ వద్దకు వెళ్లి సెల్యూట్ చేశాడు. దీంతో ఆ క్రికెటర్ అతడి జీవితం లో మర్చి పోలేని బహుమతి ఇచ్చాడు. రెండో వన్డే మ్యాచ్లో భాగంగా పాకిస్థాన్ ఆల్రౌండర్ షాదబ్ ఖాన్ 9 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తుండగా అదే సమయం లో హఠాత్తుగా ఒక అభిమాని మైదానం లోకి  వచ్చాడు.


 షాబాద్ ఖాన్ వద్దకు వెళ్లి సెల్యూట్ చేశాడు. దీంతో ఆ క్రికెటర్ కూడా అంతే ఆప్యాయంగా స్పందిస్తూ అభిమానిని ప్రేమగా హత్తుకున్నాడు. ఇక క్రికెటర్ ఇలా ఎంతో విలువైన బహుమతి ఇవ్వడం తో ఎంతో ఉప్పొంగిపోయినా అభిమాని స్టేడియంలో ఎంతో సంబరపడి పరిగెత్తుకుంటూ మళ్ళీ వెనక్కి వచ్చేశాడు. ఇక క్రికెటర్ అభిమానికి హగ్ ఇవ్వడంతో మెచ్చుకుంటూ స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు అందరూ కూడా గట్టిగా అరిచారు అని చెప్పాలి. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్ లో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: